iDreamPost

ఆర్జిత్‌ కంసర్ట్‌కి రణ్‌బీర్‌.. ఎంట్రీతో దద్దరిల్లిన స్టేజి!

అంతేకాదు! సినిమా పాటలకు కూడా సోషల్‌ మీడియాలో విపరీతమైన స్పందన వస్తోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే లక్షల వ్యూస్‌ సంపాదిస్తున్నాయి.

అంతేకాదు! సినిమా పాటలకు కూడా సోషల్‌ మీడియాలో విపరీతమైన స్పందన వస్తోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే లక్షల వ్యూస్‌ సంపాదిస్తున్నాయి.

ఆర్జిత్‌ కంసర్ట్‌కి రణ్‌బీర్‌.. ఎంట్రీతో దద్దరిల్లిన  స్టేజి!

బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌- దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా కాంబినేషన్‌లో ‘యానిమల్‌’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ప్యాన్‌ ఇండియా చిత్రమైన యానిమల్‌పై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. యానిమల్‌ నుంచి వస్తున్న ప్రతీ చిన్న అప్‌డేట్‌కు భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. కొద్దిరోజుల క్రితం విడుదలైన టీజర్‌ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. యానిమల్‌ కబీర్‌ సింగ్‌ సినిమాను మించి ఉండబోతోందని టీజర్‌తో తేలిపోయింది.

అంతేకాదు! సినిమా పాటలకు కూడా సోషల్‌ మీడియాలో విపరీతమైన స్పందన వస్తోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే లక్షల వ్యూస్‌ సంపాదిస్తున్నాయి. దేశం ఈ మూల నుంచి ఆ మూల వరకు ఉన్న రణ్‌బీర్‌ ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ ప్రేక్షకుడు ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. సినిమాకు సంబంధించిన ఏ చిన్న ఫొటో, వీడియో వచ్చినా వాటిని ట్రెండింగ్‌లోకి తీసుకెళుతున్నారు. ప్రస్తుతం, యానిమల్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌కు సంబంధించిన ఓ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఆర్జిత్‌ సింగ్‌ కంసర్ట్‌లోకి రణ్‌బీర్‌ సర్‌ప్రైజ్‌ ఎంట్రీ ఇచ్చిన ఆ వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా, ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్జిత్‌ సింగ్‌ మ్యూజిక్‌ కంసర్ట్‌ నిర్వహించారు. ‘యానిమల్‌’ సినిమాలోని ‘‘సత్రంగా’’ పాటను లైవ్‌లో పాడి వినిపిస్తూ ఉన్నారు. ఆ సమయంలో రణ్‌బీర్‌ కపూర్‌ స్టేజిపైకి సర్‌ప్రైజ్‌ ఎంట్రీ ఇచ్చారు. స్టేజిపైకి వచ్చింది రణ్‌బీర్‌ కపూర్‌ అని తెలియగానే ఫ్యాన్స్‌ గట్టిగా అరవటం మొదలుపెట్టారు. దీంతో స్టేజి దద్దరిల్లింది.  కొన్ని నిమిషాలు ఆ అరుపులు అలానే కొనసాగాయి.

స్టేజిపైనుంచి రణ్‌బీర్‌ తన అభిమానులకు అభివాదం చేశారు. తర్వాత కొంతమంది ఫ్యాన్స్‌కు ఆటోగ్రాఫ్‌ కూడా ఇచ్చారు. ఇక, రణ్‌బీర్‌-ఆర్జిత్‌ సింగ్‌లు స్టేజిపై కనిపించిన ప్రతీసారి అదో సంచలనంగా మారుతోంది. వారికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. కాగా, యానిమల్‌ సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌కు జంటగా నేషనల్‌ క్రష్‌ రష్మికా మందన్నా నటించారు. బాలీవుడ్‌ స్టార్లు బాబీ డియోల్‌, అనిల్‌ కపూర్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి