iDreamPost

తాతను హింసించి చంపారనే కోపం Jr NTRలో ఇంకా ఉంది: ఆర్జీవీ

  • Published Sep 20, 2023 | 1:04 PMUpdated Sep 20, 2023 | 1:07 PM
  • Published Sep 20, 2023 | 1:04 PMUpdated Sep 20, 2023 | 1:07 PM
తాతను హింసించి చంపారనే కోపం Jr NTRలో ఇంకా ఉంది: ఆర్జీవీ

సంచలనాలనకు మారుపేరుగా నిలుస్తారు దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. సమయం, సందర్భం, వ్యక్తులతో ఆయనకు పని లేదు. ఎవరి మీద అయినా విమర్శలు చేయాలని అనిపిస్తే చాలు.. వెంటనే మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. ఈ క్రమంలో తాజాగా జూనియర్‌ ఎన్టీఆర్‌ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాతను హింసించి చంపారనే కోపం జూనియర్‌ ఎన్టీఆర్‌లో ఇంకా ఉంది అంటూ బాంబు పేల్చారు ఆర్జీవీ. ప్రస్తుంత ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..

ఆర్జీవీ మాట్లాడుతూ.. ‘‘తన తాత నందమూరి తారకరామరావుని హింసించి చంపారనే కోపం జూనియర్‌ ఎన్టీఆర్‌లో చాలా ఉంది. అయితే తెలివి గల వారు తమ కోపాన్ని బయటకు చూపించరు. లోపలే దాచుకుంటారు. తారక్‌ లాంటి మనిషికి కృతజ్ఞత ఎక్కువగా ఉంటుంది. తాత వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని.. ఆయన మీద తారక్‌కు ఎంతో గౌరవం ఉంటుంది. ప్రస్తుతం తాను యువకుడు.. సూపర్‌ స్టార్‌ రేంజ్‌లో ఉన్నాడు. సమయం కోసం చూస్తాడు. ఆ తరుణం ఆసన్నమైన వేళ.. చంద్రబాబుకి వెన్నపోటు కాదు.. ముందు నుంచే పోటు పొడుస్తాడు. తనకు వెన్నుపోటు పొడవాల్సిన అవసరం లేదు. కాకపోతే.. ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. ఇక తాను రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తాడు అనేది తన పర్సనల్‌’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి