iDreamPost

పుష్ప-2 రాబోయేది అప్పుడే.. రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

పుష్ప-2 రాబోయేది అప్పుడే.. రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక హీరో హీరోయిన్లుగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప -1 (ద రైజ్). దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను ఓ యజ్ఞంలా చేశాడు. కథతో పాటు బన్నీ తన సెటిల్డ్ ఫెర్మాఫెన్స్ ఇవ్వడంతో తెలుగు, దక్షిణాది పరిశ్రమనే కాదూ.. బాలీవుడ్ పరిశ్రమను షేక్ చేసేసింది. ఎక్కడ చర్చ జరిగినా ఈ సినిమా గురించే. తగ్గేదేలే అన్న డైలాగే వినిపించేది. ప్రతి ఒక్కరి నోటి నుండి ఈ సినిమా పాటలే. ఈ సినిమా టీమ్ పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది. 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఎంపికయ్యారు. ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడిగా బన్నీ చరిత్రలో నిలిచిపోయారు. అలాగే ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవీశ్రీ ప్రసాద్ ను అవార్డు వరించింది. దీంతో అంబరాలను అంటే సంబరాలను చేసుకుంది చిత్ర యూనిట్. ఇప్పుడు పుష్ప-2 (ద రూల్) ను మరింత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్.

పుష్ప 2 కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ‘వేర్ ఈజ్ ద పుష్ప’ అంటూ ఓ వీడియోను విడుదల చేసి సినిమాపై మరింత హైప్ ను పెంచేశారు లెక్కల మాస్టారు సుకుమార్. అదేవిధంగా ఓ పోస్టర్ కూడా విడుదల చేశాడు. ఈ సారి మరింత మాస్ మోత మోగిపోవడం ఖాయమని చెప్పాడు. ఈసారి బాక్సాఫీసు నుండి కూడుకోలేనంత కలెక్షన్లు రాబట్టేందుకు భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఒడిశాతో పాటు పలు చోట్ల జరుపుకుంటోంది. అదేవిధంగా ఇటీవల ఓ వీడియో కూడా లీకైంది. సెట్స్‌లో వందలకొద్దీ లారీలను నిలిపి ఉంచిన వీడియో వైరల్ అయ్యింది. ఇదే సమయంలో హీరోయిన్ రష్మిక కూడా సెట్స్ ఫోటోలను తన ఇన్ స్టా వేదికగా పంచుకున్నారు. అయితే ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బిగ్ అప్ డేట్ ఇచ్చింది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. బాక్సాఫీస్ ను కొల్లగొట్టేందుకు మరోసారి పుష్పరాజ్ రాబోతున్నాడంటూ పేర్కొంది. ఈ వార్త తెలిసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి