iDreamPost

ప్రభాస్ సినిమా ప్లానింగ్ అదిరింది

ప్రభాస్ సినిమా ప్లానింగ్ అదిరింది

ఒకేసారి నాలుగు సినిమాలను సెట్స్ పైన పెట్టేసి అభిమానులతో పాటు సినీ పరిశ్రమను సైతం ఆశ్చర్యపరిచిన పాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్ వీటిలో రాధే శ్యామ్ ఒక్కటే సంపూర్ణంగా తన భాగాన్ని పూర్తి చేశాడు. రిలీజ్ ఎలాగూ ప్రకటించారు కాబట్టి మళ్ళీ ప్రమోషన్ మొదలుపెట్టే దాకా ఇక దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఇక సలార్ రెగ్యులర్ షూట్ సెకండ్ షెడ్యూల్ నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యింది. ఆది పురుష్ కూడా త్వరలోనే రీ స్టార్ట్ కాబోతోంది. ఈ రెండు సమాంతరంగా షూట్ జరుపుకునే అవకాశాలు ఉన్నాయి. వచ్చే మార్చికంతా రెండిటికి గుమ్మడి కాయ కొట్టేసి సిద్దార్థ్ ఆనంద్ తో ప్లాన్ చేసుకున్న మరో మూవీని స్టార్ చేసే ఛాన్స్ ఉంది.

వీటి సంగతి అలా ఉంచితే పాన్ వరల్డ్ మూవీగా చెప్పబడుతున్న ప్రాజెక్ట్ కెలో కొత్త ఆకర్షణలు తోడవుతున్నాయని సమాచారం. అందులో భాగంగా సమంతాకు ఒక కీలక పాత్రను ఆఫర్ చేసినట్టు వినికిడి. దర్శకుడు నాగ అశ్విన్ మీద అభిమానంతోనే తను మహానటిలోనూ జర్నలిస్ట్ క్యారెక్టర్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో కూడా మంచి పవర్ ఫుల్ పాత్ర సెట్ చేశారట. హీరోయిన్ కాకపోయినా అంతటి ప్రాధాన్యం ఉండే లెవెల్ లో దాన్ని డిజైన్ చేశారట. మరో ఇన్ సైడ్ టాక్ ప్రకారం అమితాబ్ కాంబినేషన్లో వచ్చే రెండు మూడు కీలక సన్నివేశాల కోసం ఇద్దరు స్టార్ హీరోలను సెట్ చేసుకునే పనిలో నాగ అశ్విన్ బిజీగా ఉన్నట్టు తెలిసింది.

ఆ పేర్లు ఎవరో ఇంకా బయటికి రాలేదు. ఫైనల్ అయ్యాక ఒక్కొక్కటిగా మెల్లగా అప్డేట్స్ రూపంలో ఇస్తారు. షూటింగ్ ప్లస్ రిలీజ్ కి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి అంత తొందరగా సమాచారం ఇచ్చే పరిస్థితి లేదు. దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తున్న ఈ గ్రాండియర్ లో అనుపమ్ ఖేర్ ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. సైరాలో తక్కువ సీన్లు ఉన్న చిన్న పాత్ర చేసిన బిగ్ బి అమితాబ్ కు ఇది చాలా పెద్ద రోల్. మొత్తానికి ప్రాజెక్ట్ కె టైటిల్ కే కట్టుబడతారో లేక తర్వాత మారుస్తారేమో ఇంకా వేచి చూడాలి. వైజయంతి మూవీస్ బ్యానర్ దీని కోసం ఏకంగా అయిదు వందల కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు వినికిడి

Also Read : హోమ్ ఎంటర్టైన్మెంట్ సత్తా ఇది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి