iDreamPost

వీడియో: ప్రభాస్ ఫ్యాన్స్ అత్యుత్సాహం.. థియేటర్ స్క్రీన్ చింపేసి..!

వీడియో: ప్రభాస్ ఫ్యాన్స్ అత్యుత్సాహం.. థియేటర్ స్క్రీన్ చింపేసి..!

ఇప్పుడు టాలీవుడ్ లో కొత్త సినిమాల విడుదల కన్నా పాత సినిమాల రీరిలీజ్ లే ఎక్కువగా అవుతున్నాయి. ఏ హీరో పుట్టిన రోజు అయినా పాత చిత్రాలను థియేటర్ లో రీరిలీజ్ చేస్తూ అటు అభిమానులకు సంతోషాన్ని ఇస్తూ ఇటు మెల్లగా బిజినెస్ చేసుకుంటున్నారు. ఇప్పటికీ ఎన్నో సినిమాలు థియేటర్ లో రీరిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఇక అభిమాన హీరో పాత సినిమా రీరిలీజ్ అవుతుండడంతో అభిమానులు థియేటర్ లోకి వెళ్లి నానా హంగామా చేస్తున్నారు. ఇంతటితో సరిపెట్టకుండా థియేటర్ స్క్రీన్ చింపేయడం, దానికి నిప్పు అంటించడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలానే జరిగాయి. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా మరొకటి చోటు చేసుకుంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అప్పట్లో నటించిన చిత్రం యోగి. ఈ సినిమా అప్పుడు విడుదలై ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక తాజాగా ఇదే చిత్రాన్ని థియేటర్ లో రీరిలీజ్ చేశారు. దీంతో ప్రభాస్ అభిమానులు థియేటర్ కు క్యూ కట్టారు. అయితే నంద్యాలలోని ఓ థియేటర్ లో కూడా యోగి మూవీ రీరిలీజ్ అయింది. దీంతో స్థానికంగా ఉన్న ప్రభాస్ అభిమానులు సినిమా చూసేందుకు భారీగా తరలి వచ్చారు. ఇక మూవీ చూసి వెళ్లిపోకుండా కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. స్కీన్ దగ్గరికి వెళ్లి డ్యాన్సులు చేస్తూ ఊగిపోయారు. ఇంతే కాకుండా స్క్రీన్ మీద పడిపోవడంతో అది రెండుచోట్ల చినిగిపోయి డ్యామేజ్ అయింది. దీంతో థియేటర్ యాజమాన్యం వెంటనే స్పందించి సినిమా ఆపివేసింది. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై స్పందించిన కొందరు నెటిజన్స్ అగ్రహం వ్యక్తం చేశారు. సినిమా చూసి వెళ్లి పోకుండా ఇవేం పిచ్చి పనులు అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇది కూడా చదవండి: వీకెండ్స్ లో టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వండి: సురేశ్ బాబు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి