iDreamPost

ప్రేమికులను కత్తితో బెదిరించి, వివస్త్రలను చేసి..నగ్నంగా ఫొటోలు వీడియోలు తీసి..

భువనేశ్వర్ లోని జయపురం పారాబెడకు కొంతదూరంలో ఇద్దరు ప్రేమికులు మాట్లాడుకుంటుండగా.. వారిద్దరు ఇద్దరు యువకులు వెళ్లి కత్తిని చూపించి భయపెట్టారు. సమీపంలో ఉన్న కొండపైకి తీసుకెళ్లారు.

భువనేశ్వర్ లోని జయపురం పారాబెడకు కొంతదూరంలో ఇద్దరు ప్రేమికులు మాట్లాడుకుంటుండగా.. వారిద్దరు ఇద్దరు యువకులు వెళ్లి కత్తిని చూపించి భయపెట్టారు. సమీపంలో ఉన్న కొండపైకి తీసుకెళ్లారు.

ప్రేమికులను కత్తితో బెదిరించి, వివస్త్రలను చేసి..నగ్నంగా ఫొటోలు వీడియోలు తీసి..

ప్రేమికులను కత్తితో బెదిరించి.. కొండపైకి తీసుకెళ్లి వివస్త్రలను చేసి నగ్నంగా ఫొటోలు, వీడియోలు తీసి భయపెట్టి, వారి నుంచి డబ్బులను డిమాండ్ చేసిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. భువనేశ్వర్ లోని జయపురం పారాబెడకు కొంతదూరంలో ఇద్దరు ప్రేమికులు మాట్లాడుకుంటుండగా.. వారిద్దరు ఇద్దరు యువకులు వెళ్లి కత్తిని చూపించి భయపెట్టారు. సమీపంలో ఉన్న కొండపైకి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడున్న మరో ముగ్గురితో కలిసి ప్రేమికులను వివస్త్రలను చేసి నగ్నంగా వీడియోలు, ఫొటోలు తీశారు. అనంతరం రూ.50 వేలు డిమాండ్ చేశారు. విషయం ఎవరికైనా చెప్తే.. సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని హెచ్చరించారు.

తమ వద్ద దుండగులు డిమాండ్ చేసినంత నగదు లేకపోవడంతో.. ఉన్న రూ.7 వేల నగదును దుండగులకు ఇచ్చారని పోలీసులు వెల్లడించారు. శనివారం మరో రూ.13 వేలు, మిగతా రూ.30 వేలు నెలరోజుల్లో ఇస్తామని ప్రేమికులు దుండగులకు చెప్పారు. బంధువుల సహాయంతో శుక్రవారం రాత్రి పోలీసులకు ప్రేమికులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి 5గురు దుండులను అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో జయపురం కౌదంబ వీధి టుకున జాని, రోహిత్‌ గరడ, దీపక్‌ సావుడ్, కపిల పొరిచ, ఒక మైనర్‌ బాలుడు ఉన్నారు. నిందితుల నుంచి రెండు సెల్ఫోన్లు, రూ.7 వేల నగదు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి