iDreamPost

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత ఆడియో వైరల్.. 2024లో పెద్ద ప్లానే..

  • Published Feb 03, 2024 | 5:34 PMUpdated Feb 03, 2024 | 5:34 PM

ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో చాలా వరకు సినిమాలను అందించిన సంస్థ "పీపుల్ మీడియా ఫ్యాక్టరీ". అయితే, ఈ ప్రొడక్షన్ కంపెనీ నుండి ఈ ఏడాది ఏకంగా భారీగా సినిమాలు రాబోతున్నాయని ప్రొడ్యూసర్ విశ్వ ప్రసాద్ చెప్పుకొచ్చారు.

ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో చాలా వరకు సినిమాలను అందించిన సంస్థ "పీపుల్ మీడియా ఫ్యాక్టరీ". అయితే, ఈ ప్రొడక్షన్ కంపెనీ నుండి ఈ ఏడాది ఏకంగా భారీగా సినిమాలు రాబోతున్నాయని ప్రొడ్యూసర్ విశ్వ ప్రసాద్ చెప్పుకొచ్చారు.

  • Published Feb 03, 2024 | 5:34 PMUpdated Feb 03, 2024 | 5:34 PM
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత ఆడియో వైరల్.. 2024లో పెద్ద ప్లానే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా వరకు ఇప్ప్డుడు వస్తున్న సినిమాలన్నీ కూడా.. ఈ ప్రొడక్షన్ కంపెనీ నుంచి వస్తున్నవే. ప్రేక్షకులకు మంచి సినిమాటిక్ అనుభవాలను అందించే దిశగా.. 2017 నుంచి కొనసాగుతున్న సంస్థ “పీపుల్ మీడియా ఫ్యాక్టరీ”. ఈ సంస్థ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రొడక్షన్ , ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ , కో ప్రొడక్షన్ లాంటి ఎన్నో ఈవెంట్స్ అందించి.. ప్రత్యేకంగా నిలుస్తోంది ఈ సంస్థ. ఈరోజున ఇండస్ట్రీలో ఈ సంస్థకు ప్రత్యేకమైన ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే ఇండస్ట్రీకి ఎన్నో హిట్ చిత్రాలను అందించిన ఈ సంస్థ.. ఈ ఏడాది భారీ సంఖ్యలో సినిమాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు కార్తికేయ 2, వెంకీ మామ, నిశ్శబ్దం, ఓ బేబీ, కుడి ఎడమైతే, న్యూసెన్స్, ధమాకా, రాజా రాజా చోరా, BRO , ది అవతార్‌ ఇలాంటి ఎన్నో సక్సెస్ ఫుల్ ప్రాజెక్ట్స్ ను ఇండస్ట్రీకి అందించింది.

ఇక ఇప్పుడు ఈ ఏడాది ఈ సంస్థ నుంచి మరెన్నో ప్రాజెక్టులు.. విడుదలకు సిద్ధంగా ఉన్నాయని సమాచారం. ఈ క్రమంలో ప్రముఖ ప్రొడ్యూసర్ విశ్వ ప్రసాద్ .. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ ఏడాది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా విడుదల కాబోయే చిత్రాల గురించి ప్రస్తావించారు. ఈ ఏడాది పీపుల్ మీడియా నుంచి ఎన్ని సినిమాలు రాబోతున్నాయని ప్రశ్నించగా.. ” ఆరు మూవీలు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మేము దాని మీద వర్క్ చేయాల్సి ఉంది. కనీసం 15 సినిమాలను అయితే రిలీజ్ చేస్తాము. ఇప్పటికే ఒక 6 సినిమాలు కంప్లీట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. ఇవి కాకుండా ఈటీవీ తో ఒక భారీ డీల్ ను కుదుర్చుకుంటున్నాము. తెలుగుతో పాటు తమిళంలోను కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అంతేకాకుండా, ఈగిల్, ప్రభాస్-మారుతీ ఫిల్మ్, శ్వాగ్ , శర్వా 35 ఇలా మరెన్నో ముఖ్యమైన సినిమాలు పైప్‌లైన్‌లో ఉన్నాయి.” అంటూ విశ్వ ప్రసాద్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఆడియో సామజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. చూడబోతుంటే 2024లో భారీగానే సినిమాలు విడుదల అయ్యేలా ఉన్నాయి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి