iDreamPost

బంగారం సినిమాలోని చిన్నారి.. ఇప్పుడు చూస్తే అస్సలు గుర్తు పట్టలేరు!

  • Published Apr 06, 2024 | 1:11 PMUpdated Apr 06, 2024 | 1:11 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమాలో.. హీరోయిన్ చెల్లెలిగా నటించిన ఈ చిన్నారి ఎవరికైనా గుర్తుందా..? అయితే ఇప్పుడు చిన్నారి ఎంతాలా మారిపోయిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమాలో.. హీరోయిన్ చెల్లెలిగా నటించిన ఈ చిన్నారి ఎవరికైనా గుర్తుందా..? అయితే ఇప్పుడు చిన్నారి ఎంతాలా మారిపోయిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

  • Published Apr 06, 2024 | 1:11 PMUpdated Apr 06, 2024 | 1:11 PM
బంగారం సినిమాలోని చిన్నారి.. ఇప్పుడు చూస్తే అస్సలు గుర్తు పట్టలేరు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకే కాదు, ఈయన సినిమాలకు కూడా ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఉంది. ఈ క్రమంలోనే పవన్ నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే చాలు.. ఆయన అభిమానులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతలా పవన్ కు, ఆయన సినిమాలకు ప్రేక్షకుల్లోనూ, సినీ ఇండస్ట్రీలోనూ.. ఆద్భుతమైన రెస్పాన్స్ ఉంటుంది. ఇక ఎన్నో నటించిన ఎన్నో ఆద్భుతమైన సినిమాల్లో ‘బంగారం’ సినిమా కూడా ఒకటి. ఇందులో పవరన్ కళ్యాణ్ జర్నలిస్ట్ గా నటించారు. కాగా, 2006లో రిలీజ్ అయిన ఈ సినిమాకదు ధరణి దర్శకత్వం వహించగా.. హీరోయిన్ గా మీరా చోప్రా నటించింది. ఇక బంగారం సినిమాకు ఏఏం రత్నం నిర్మాతగా వ్యవహరించగా.. విద్యాసాగర్ సంగీతాన్ని అందించారు. అయితే ఈ సినిమా ఆశించిన విజయం అందుకోలేకపోయింది. కానీ, ఈ సినిమాలో పాటలు మాత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా, బంగారం సినిమా రిజల్ట్ ఫెయిల్ అయిన.. అందులో నటించిన ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా గుర్తుండి పోయారు. ముఖ్యంగా.. ఈ సినిమాలో హీరోయిన్ చెల్లెలిగా నటించిన ఈ చిన్నారి ఎవరికైనా గుర్తుందా..? అయితే ఇప్పుడు చిన్నారి ఎంతాలా మారిపోయిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమా గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ కు చెల్లిగా నటించిన ఓ చిన్నారి కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే.. బంగారం సినిమాలో ఈ చిన్నారి చాలా కీలకమైన పాత్రలో నటించింది. అయితే ఇప్పుడు ఈ చిన్నారి ఎలా ఉందో.. ఎక్కడ ఉందో, ఏం చేస్తోందో తేలిస్తే షాక్ అయిపోతారు. బంగారం సినిమాలో హీరోయిన్ మీరా చోప్రాకు చెల్లెలుగా నటించిన ఈ చిన్నారి పేరు ‘సనూషా సంతోష్’. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ మొదలుపెట్టిన ఈ చిన్నారి మలయాళంలో దాదాపు 20 సినిమాలకు పైగా నటించింది. అంతేకాకుండా.. అతి చిన్న వయసులోనే సనూషా సంతోష్ ఉత్తమ బాలనటిగా రెండు సార్లు జాతీయ అవార్డును అందుకుంది. అయితే, అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సనూషా సంతోష్ ఇప్పుడు ఏకంగా హీరోయిన్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే.. 2012లో మిస్టర్‌ ‘మురుగన్‌’ అనే సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయ్యింది.

ఇక ఆ తర్వాత సనూషా సంతోష్.. ‘రేణిగుంట’, ‘జీనియస్‌’ వంటి చిత్రాల్లోనూ నటించింది. అలాగే తెలుగులో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన జర్సీ సినిమాలో చిన్న పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఆ సినిమా తర్వాత ఇక ఏ సినిమాలోను ఈ మలయాళీ ముద్దుగుమ్మ కనిపించలేదు. కానీ, తరుచు సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ.. తన రెగ్యులర్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ చిన్నదాని లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ బంగారం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఈమెనా అంటూ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా.. ఇప్పుడు చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి, బంగారం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ లేటెస్ట్ ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by The Tiffinbox UK (@thetiffinboxuk)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి