iDreamPost

Pavitra Lokesh: సైబర్‌ పోలీసుల‌కు నటి ఫిర్యాదు

Pavitra Lokesh: సైబర్‌ పోలీసుల‌కు నటి ఫిర్యాదు

సీనియర్ కేర‌క్ట‌ర్ నటి పవిత్ర లోకేష్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. తన పేరుతో కొందరు నకిలీ ఖాతాలు తెరిచారని, తన పేరుప్రతిష్టలకు భంగం కలిగించేలా పోస్టులు పెడుతున్నార‌ని సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. త‌న మీద లేనిపోని గాసిప్స్ క్రియేట్ చేస్తున్నార‌ని, అసత్య క‌థ‌నాల‌ను ప్రచార‌న్న‌ది ఆమె ఆరోప‌ణ‌. కేసు నమోదు చేసుకున్న మైసూర్ సైబ‌ర్ క్రైమ్ పోలీసులు న‌కిలీ ఖాతాల‌మీద విచార‌ణ జ‌రుపుతున్నారు.

కన్నడ నటిగా పేరుతెచ్చుకున్నా తెలుగులోనే బాగా ఫేమ‌స్. స్టార్ హీరో హీరోయిన్లకు తల్లిగా, అత్తగా ఆమె నటించారు. కొన్నేళ్లుగా పవిత్ర లోకేష్ టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు నరేశ్‌ను పెళ్లి చేసుకోబోతుందంటూ ప్ర‌చారం నడుస్తోంది. దీనిపై నరేశ్‌ కానీ, పవిత్ర లోకేష్ కాని అధికారికంగా స్పందించనేలేదు.

పవిత్రా లోకేష్ ను సీనియ‌ర్ న‌రేష్ 4 వ పెళ్లి చేసుకోబోతున్నట్లు చాలా క‌థ‌నాలు వ‌స్తున్నాయి. న‌రేష్ ఫ్యామిలీ ఫోటోల్లో ప‌విత్ర క‌నిపించారు. ఇద్ద‌రి మ‌ధ్య అనుబంధం ఉంద‌న్న‌ది ప్ర‌చారం.

ఆమె బెంగుళూరులో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఒంటరిగా నివాసముంటున్నారు. 2007 లో సుచేంద్ర ప్రసాద్ ని పెళ్లి చేసుకున్న పవిత్రా, వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే నరేష్ ను ఆమె రెండో వివాహం చేసుకోబోతుంద‌ని అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి