iDreamPost

అత్యంత గోప్యంగా పవన్ ఢిల్లీ పర్యటన.. అందరూ బిజీ

అత్యంత గోప్యంగా పవన్ ఢిల్లీ పర్యటన.. అందరూ బిజీ

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్​ తన ఢిల్లీ పర్యటనను అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, తదితరులతో ఆయన సమావేశం అవుతారని వార్తలు వచ్చినా పవన్ ఇప్పటివరకూ అధికారికంగా ఎవరినీ కలవలేదు.

పవన్ ఆదివారం పూర్తిగా తాను బస చేసిన హోటల్​కే పరిమితమయ్యారని సమాచారం. అమిత్​ షా మధ్యప్రదేశ్​ పర్యటనతో పాటు డిల్లీ ఎన్నికల హడావుడిలో ఉన్నారు. మరోవైపు బీజేపీ అగ్రనేతలు డిల్లీ అభ్యర్థుల ఎంపికపై కోర్​ కమిటీ సమావేశంలో బిజీగా ఉన్నారు. దీంతో పార్టీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్​ నేడు డిల్లీకి చేరుకోనున్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికలపై మరో ప్రధాన కార్యదర్శి సంతోష్ కూడా ఏమాత్రం తీరికలేకుండా ఉన్నారట.. దీంతో పవన్ ఆర్​ఎస్​ఎస్​ నేతలను కలిసేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. ఓవైపు గోప్యత పాటిస్తూ బీజేపీ అగ్ర నేతలను కలిసేందుకు పవన్ ప్రయత్నిస్తున్నా అవకాశం దక్కలేదు. సోమవారం అయినా జనసేనాని భేటీలు జరుగుతాయా లేదా నిరాశతోనే వెనుతిరుగుతాడా అనేది చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి