iDreamPost

పాకిస్తాన్ తో గూఢచర్యం – ఏడుగురు నేవి అధికారుల అరెస్ట్

పాకిస్తాన్ తో  గూఢచర్యం – ఏడుగురు నేవి అధికారుల అరెస్ట్

పాకిస్తాన్ కి సమాచారం అందిస్తున్నారన్న కారణంతో విజయవాడకు చెందిన ఏడుగురు నేవీ అధికారులని ఇంటిలిజెన్స్ అధికారులు అరెస్టు చేసారు. పాకిస్తాన్ చెందిన హవాలా వ్యాపారులతో సంబంధం కలిగి ఉన్నారని విజయవాడలో ఇంటిలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర నిఘా సంస్థతో కలిసి ఏపీ ఇంటిలిజెన్స్ డాల్ఫిన్ నోస్ ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. వీరితో పాటు మరికొందరు అనుమానితులను కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు.

ఏడుగురు నేవి సిబ్బందితో పాటు ఒక హవాలా ఆపరేటర్ ని కూడా ఇంటిలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేసారు.పాకిస్తాన్ కి చెందిన హవాలా వ్యాపారులతో పెద్ద ఎత్తున నోట్ల మార్పిడి విషయంలో సంబంధాలు కలిగి ఉన్నారని ఇంటిలిజెన్స్ అధికారులు గుర్తించారు పాకిస్తాన్ కి,మన దేశ నేవీకి చెందిన రహస్య సమాచారాన్ని పంపార అన్న కోణంలో అధికారులు విచారణ చేపట్టనున్నారు. ఏడుగురు నిందితులను విజయవాడలో NIA కోర్టుకు తరలించారు. దీనిపై మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి