iDreamPost

హీరోయిన్ శ్రియను అభినందించిన మోహన్ బాబు

హీరోయిన్ శ్రియను అభినందించిన మోహన్ బాబు

మోహన్ బాబు హీరోగా  తెరకెక్కిన గాయత్రి సినిమా ఇటీవల విడుదలయ్యింది. మోహన్ బాబు ప్రధాన పాత్రగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే ఈ సినిమాలో మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు నటించాడని మనకందరికీ తెలుసు. మంచు విష్ణు కి  జతగా జోడీ కట్టిన హీరోయిన్ శ్రియ మీద విలక్షణ నటుడు మోహన్ బాబు ప్రశంసల జల్లు కురిపించారు.

సూటిగా స్పష్టంగా మొహం మీద మాట్లాడే మోహన్ బాబు హీరోయిన్ శ్రియ ను ఆమె నటనను ఆకాశానికి ఎత్తేశారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ కార్యక్రమం లో మోహన్ బాబు మాట్లాడుతూ నేను  ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లను పరిచయం చేశాను వాళ్ల ప్రవర్తన ఇప్పుడు బయట వేరేవిధంగా ఉంది. శ్రియను నేను పరిచయం చేయలేదు….కానీ చాలా మంచి అమ్మాయి. ఈ సినిమాలో శ్రియ పోషించిన పాత్రను చూస్తే, ఆమె మాత్రమే చేయగలదనిపించింది. సినిమా చూస్తే మీకు కూడా అదే అనిపిస్తుంది. మోహన్ బాబు వ్యాఖ్యాలతో హీరోయిన్ శ్రియ తెగ ఆనందపడింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి