iDreamPost

నా తండ్రి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు – అమృత

నా తండ్రి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు – అమృత

తన తండ్రి ఇంట్లో ఆస్తి తగాదాలు ఉన్నమాట వాస్తవమే అని, తన తండ్రి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు మాత్రం కాదని మారుతీరావు కుమార్తె అమృత మీడియాతో అన్నారు.

రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో ఆర్యవైశ్య భవనంలో అనుమానాస్పద రీతిలో మరణించిన సంగతి తెలిసిందే. కాగా తండ్రి భౌతికకాయాన్ని కడసారి చూడటానికి ప్రయత్నించిన అమృతను మారుతీరావు బంధువులు అడ్డుకుని అమృత గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో అమృత వెనుతిరగాల్సివచ్చింది.

అనంతరం మీడియాతో మాట్లాడిన అమృత తన తండ్రి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, వేరే కారణాలవల్ల ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అభిప్రాయపడింది. తనకి తమకి ఉన్న ఆస్తుల గురించి తెలియదని, ఆస్తులపై ఆసక్తి కూడా లేదని స్పష్టం చేసింది. భర్తను కోల్పోతే వచ్చే బాధ ఏంటో తనకు తెలుసనీ, అందుకే తల్లిని పరామర్శించడానికి వెళ్లాలని తెలిపారు.

తన తల్లి దగ్గరకు వెళ్లే ఆలోచన లేదని, ఒకవేళ తన తల్లి తనదగ్గరకు వస్తే కాదనను అని అమృత స్పష్టం చేసారు. తన గురించి మాత్రం తన తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకోలేదని తెలిపారు. నాన్న మారుతీరావు, బాబాయ్‌ శ్రవణ్‌ మధ్య గొడవలు ఉన్నాయని,తన తండ్రిని బాబాయ్‌ రెండుసార్లు కొట్టినట్లు తెలిసిందని తెలిపారు. తన భర్త ప్రణయ్‌ చనిపోయినప్పుడు ఎలా ధైర్యంగా ఉన్నానో… ఇప్పుడు తండ్రి చనిపోయినా అంతే ధైర్యంగా ఉన్నానని అమృత మీడియాతో అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి