iDreamPost

Mahesh Babu: మహేష్ కోసం ఆ హీరోయిన్​ను రిపీట్ చేస్తున్న జక్కన్న.. ప్లానింగ్ అదుర్స్!

  • Published Feb 09, 2024 | 7:03 PMUpdated Feb 09, 2024 | 7:11 PM

ఈ సంక్రాంతికి ‘గుంటూరు కారం’తో సందడి చేశారు సూపర్​స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో చేయబోయే ప్రాజెక్టుకు సంబంధించిన పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు.

ఈ సంక్రాంతికి ‘గుంటూరు కారం’తో సందడి చేశారు సూపర్​స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో చేయబోయే ప్రాజెక్టుకు సంబంధించిన పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు.

  • Published Feb 09, 2024 | 7:03 PMUpdated Feb 09, 2024 | 7:11 PM
Mahesh Babu: మహేష్ కోసం ఆ హీరోయిన్​ను రిపీట్ చేస్తున్న జక్కన్న.. ప్లానింగ్ అదుర్స్!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సంక్రాంతి పండక్కి తెగ సందడి చేశారు. ఆయన యాక్ట్ చేసిన ‘గుంటూరు కారం’ పొంగల్​కు రిలీజై మంచి విజయాన్ని సాధించింది. ఈ మూవీ కంటెంట్ విషయంలో మిక్స్​డ్ ఓపీనియన్స్ వచ్చినా, నెగెటివ్ టాక్ వచ్చినా మహేష్ స్టామినాతో సినిమా సేల్ అయిపోయింది. ఆడియెన్స్​లో సూపర్​స్టార్​కు ఉన్న పాజిటివ్ ఒపీనియన్, సినిమాలో మహేష్ చేసిన ఊరమాస్ డాన్స్, యాక్టింగ్ ‘గుంటూరు కారం’ను ఒడ్డున పడేశాయి. ఈ చిత్రం సందడి ముగియడంతో దర్శకధీరుడు రాజమౌళితో చేయబోయే తదుపరి ప్రాజెక్టు పనుల్లో ఫుల్ బిజీ అయ్యారు మహేష్. పాన్ వరల్డ్ రేంజ్​లో రూపొందనున్న ఈ ఫిల్మ్​కు సంబంధించిన పనులు ఇప్పటికే జోరందుకున్నాయి. ఈ సినిమాకి హీరోయిన్​కు కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

మహేష్​-జక్కన్న కాంబోలో తెరకెక్కనున్న మూవీలో హీరోయిన్​గా చాలా మంది పేర్లు వినిపించాయి. అయితే ఎట్టకేలకు సూపర్​స్టార్​కు జోడీగా ఎవరు నటించాలనేది రాజమౌళి ఫైనలైజ్ చేశారట. ‘వన్: నేనొక్కడినే’ చిత్రంలో మహేష్ పక్కన నటించిన బ్యూటీ కృతి సనన్​ను హీరోయిన్​గా ఓకే చేశారని టాలీవుడ్ టాక్. బాలీవుడ్​లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్​తో సూపర్ ఫామ్​లో ఉన్న కృతి.. ‘ఆదిపురుష్’ సినిమాతో గతేడాది పాన్ ఇండియా ఆడియెన్స్​ను ఆకట్టుకున్నారు. మహేష్​తో తీయబోయే సినిమాలో ఫిమేల్ లీడ్ రోల్​కు కృతి అయితేనే న్యాయం చేయగలరని జక్కన్న భావిస్తున్నారని టాలీవుడ్ సమాచారం. ఎత్తు, అందం విషయంలోనూ మహేష్​-కృతి జోడీ అదిరిపోతుంది కాబట్టి జక్కన్న ఆమెకే ఓటేశారని ఫిల్మ్​నగర్​ టాక్. కృతికి నార్త్​లో మంచి మార్కెట్ ఉంది. ‘మిమి’ లాంటి లేడీ ఓరియంటెడ్ మూవీస్​తోనూ హిట్స్ అందుకున్నారు.

తెలుగునాట కూడా కృతిసనన్​ తెలిసిన ఫేస్. ‘వన్’, ‘దోచెయ్’ చిత్రాలతో ఇక్కడి ఆడియెన్స్​కు కృతి సుపరిచితురాలు. ఇటీవల ‘ఆదిపురుష్​’తో మరోమారు ప్రేక్షకులకు చేరువయ్యారామె. ఈ నేపథ్యంలో ఇటు బాలీవుడ్​లో కలసిరావడంతో పాటు తెలుగులోనూ ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుందని అనుకుంటున్నారట. అప్పుడెప్పుడో ‘వన్​’లో కలసి యాక్ట్ చేశారు మహేష్-కృతి. కాబట్టి ఇన్నాళ్ల తర్వాత మళ్లీ కలసి నటిస్తే అభిమానులకు మంచి ఫీలింగ్ ఇవ్వొచ్చని భావిస్తున్నారని సమాచారం. అయితే కృతిసనన్​ను ఫైనలైజ్ చేయడంపై ఇప్పటిదాకా మూవీ యూనిట్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. కానీ ఈ న్యూస్ తెలిసిన నెటిజన్స్ మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ పక్కన కృతి పర్ఫెక్ట్​గా ఫిట్ అవుతుందని.. వాళ్ల పెయిర్ క్యూట్​గా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి ప్లానింగ్ అదుర్స్ అని అంటున్నారు. కాగా, జక్కన్న మూవీ పనుల్లో భాగంగా ఇటీవలే జర్మనీకి వెళ్లొచ్చారు సూపర్​స్టార్. ఆ ట్రిప్​నకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. మరి.. మహేష్​కు జోడీగా కృతిసనన్ యాక్ట్ చేస్తే చూడాలని అనుకుంటున్నట్లయితే కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: Heroine: స్టార్ హీరోయిన్ కి నాన్ బెయిలబుల్ వారెంట్.. అరెస్ట్ తప్పదా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి