iDreamPost

కర్నూలు: లారీ ఎక్కిన విమానం.. చూసేందుకు తరలి వచ్చిన జనాలు

  • Published Sep 03, 2023 | 4:35 PMUpdated Sep 03, 2023 | 4:35 PM
  • Published Sep 03, 2023 | 4:35 PMUpdated Sep 03, 2023 | 4:35 PM
కర్నూలు: లారీ ఎక్కిన విమానం.. చూసేందుకు తరలి వచ్చిన జనాలు

విమానం ఆకాశంలో ఎగురుతుంది.. లారీ రోడ్డు మీద నడుస్తుంది. మరి ఆ రెండు ఎలా కలుస్తాయి.. అందునా.. లారీ మీద విమానం ఎక్కడ ఎలా సాధ్యం అవుతుంది.. కాదు కదా.. ఒకవేళ అలా జరిగితే అది పెద్ద వింతే అవుతుంది. తాజాగా ఈ తరహా దృశ్యం ఒకటి వెలుగు చూసింది. ఆకాశంలో ఎగరాల్సిన విమానం కాస్త.. రోడ్డు మీద ప్రయాణం చేసే లారీ పైన ఎక్కింది. ఈ వింత చూసేందుకు జనాలు తరలి వచ్చారు. ఈ వింత ఘటన ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. లారీ మీద ఉన్న విమానంతో సెల్ఫీలు దిగడానికి జనాలు క్యూ కట్టారు. మరి ఈ వింత సంఘటన ఎలా జరిగింది అంటే..
కర్నూలులో సిటీ ఆన్ వింగ్స్ బై మార్స్ అనే పేరుతో ఓ రెస్టారెంట్ ఏర్పాటు చేస్తున్నారు. విమానం థీమ్‌తో ఈ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో దీని కోసం రెస్టారెంట్‌ నిర్వాహకులు.. ఢిల్లీ నుంచి నుంచి ఓ లారీలో విమానాన్ని కర్నూలుకు తీసుకువచ్చారు. నగర శివార్లలో ఈ వాహనాన్ని ఆపారు. దాంతో లారీ ఎక్కిన విమానాన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. అటుగా వెళ్తున్న వాహనదారులు, స్థానికులు విమానం లారీ ఎక్కింది ఏంటి అంటూ ఆశ్చర్యపోవడమే కాకా..  దానితో సెల్ఫీలు దిగారు.
ఇలాంటి థీమ్‌తో హైదరాబాద్‌లోనూ ఓ రెస్టారెంట్ ఓపెన్ కానుంది. శామీర్ పేటలో పిస్తా హౌస్ దీనిని ఏర్పాటు చేస్తోంది. దీని కోసం ఎయిర్ ఇండియా సంస్థకు సంబంధించిన తొలి ఎయిర్‌బస్-320ని గతేడాది పిస్తా హౌస్ కొనుగోలు చేసింది. ఇప్పటికే దీనిని హైదరాబాద్‌కు తరలించగా.. ప్రస్తుతం విమానాన్ని.. రెస్టారెంట్‌గా తీర్చిదిద్దే పనులు జోరుగా జరుగుతున్నాయి. త్వరలోనే హైదరాబాద్‌లో కూడా విమానం రెస్టారెంట్‌ ఒపెన్‌ కానుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి