iDreamPost

భారీ మెజార్టీతో కోమటి రెడ్డి బ్రదర్స్ ఘన విజయం

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటి రెడ్డి బ్రదర్స్ విజయం సాధించారు. ల్గొండ నుంచి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, మునుగోడు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై రోజ్ గోపాల్ రెడ్డి గెలుపొందారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటి రెడ్డి బ్రదర్స్ విజయం సాధించారు. ల్గొండ నుంచి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, మునుగోడు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై రోజ్ గోపాల్ రెడ్డి గెలుపొందారు.

భారీ మెజార్టీతో కోమటి రెడ్డి బ్రదర్స్ ఘన విజయం

కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎట్టకేలకు కోమటి రెడ్డి బ్రదర్స్ విజయం సాధించారు. నల్గొండ నుంచి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తన ప్రత్యర్థి అయిన కంచర్ల భూపాల్ రెడ్డిపై 54 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇక మునుగోడు విషయానికొస్తే.. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై రోజ్ గోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఈ గెలుపుతో కోమటి రెడ్డి బ్రదర్స్ నల్గొండ జిల్లాలో తమ సత్తా ఏంటో మరిసారి చూపించారు. వీరి విజయంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ లీడర్లు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక కొడంగల్ లో టీపీసీసీ చీఫ్ రెవంత్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై 32,800 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఇక తన చెల్లెలుగా భావించే సీతక్క సైతం ములుగు నుంచి విజయం ఢంకా మోగించారు. వీరితో పాటు రామగుండం నుంచి రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్, బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్ కుమార్, అంధోల్ లో దామోదర్ రాజనర్సింహ, ఇల్లెందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరం కనకయ్య, వంటి నేతలు తమ ప్రత్యర్థి అభ్యర్థులపై ఘన విజయం సాధించారు. వీల్లే కాకుండా తెలంగాణ మిగతా అసెంబ్లీ నియోజవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి