iDreamPost

జగన్ ఇంటికి చేరుకున్న కరణం బలరాం

జగన్ ఇంటికి చేరుకున్న కరణం బలరాం

వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్న టీడీపీ నేత, ప్రకాశంజిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి తాడేపల్లి చేరుకున్నారు. తన కుమారుడు, అనుచరులతో కలసి సీఎం వైఎస్‌ జగన్‌ నివాసంలోకి వెళ్లారు. ఉదయం చీరాలలో తన నివాసంలో అనుచరులు, నేతలతో సమావేశమైన కరణం పార్టీ మారే విషయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

నియోజకవర్గ అభివృద్ధి, ప్రజలకు న్యాయం చేసేందుకే తాను అధికార పార్టీలో చేరుతున్నట్లు కరణం మీడియాకువెల్లడించారు.

కరణం పార్టీ వీడుతున్న విషయం అధికారికంగా వెళ్లడవడంతో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకాశం జిల్లా నేతలతో సమావేశమయ్యారు. చీరాల టీడీపీ ఇన్‌చార్జిగా యడం బాలాజీని నియమించారు. యడం బాలాజీ గత ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీ టిక్కెట్‌ దక్కకపోడంతో టీడీపీలో చేరారు. 2014లో చీరాల నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి