iDreamPost

రోడ్డు ప్రమాదంలో నటుడికి తీవ్రగాయాలు.. బైక్ పై ఓవర్ టేక్ చేస్తుండగా..

  • Author Soma Sekhar Published - 01:34 PM, Mon - 26 June 23
  • Author Soma Sekhar Published - 01:34 PM, Mon - 26 June 23
రోడ్డు ప్రమాదంలో నటుడికి తీవ్రగాయాలు.. బైక్ పై ఓవర్ టేక్ చేస్తుండగా..

ప్రస్తుతం ఇండస్ట్రీని వరుసగా విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రముఖ నటీ, నటులు పలు కారణాల చేత మరణిస్తున్నారు. దాంతో ఇండస్ట్రీ ఇప్పటికే తీవ్ర విషాదంలో నిండిఉంది. తాజాగా మరో హీరో రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలైయ్యాడు. హైవే పై ట్రాక్టర్ ను ఓవర్ టేక్ చేసే క్రమంలో వేగంగా వస్తున్న లారీని ఢీ కొన్నాడు ఆ నటుడు. దాంతో హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..

ప్రముఖ కన్నడ నటుడు సురజ్ కుమార్ అలియాస్ ధృవన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరజ్ కుమార్ మైసూర్ నుంచి ఊటీకి బైక్ పై వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే శనివారం మైసూర్-గుడ్లుపేట్ జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న లారీని ఢీ కొన్నాడు. రోడ్డుపై ట్రాక్టర్ ను ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో.. బైక్ అదుపుతప్పింది. దాంతో ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని ఢీ కొట్టాడు. ఈ ఘటనలో అతడి కాలు నుజ్జునుజ్జు అయ్యింది. దాంతో అతడి కాలును తీసేసినట్లు తెలుస్తోంది. దివంగత ప్రొడ్యూసర్ పార్వతమ్మ రాజ్ కుమార్ సోదరుడు, సినీ నిర్మాత ఎస్ఏ శ్రీనివాస్ తనయుడే ఈ సూరజ్ కుమార్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక తన పేరును ధృవన్ గా మార్చుకున్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి