iDreamPost

బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ కోడలు మృతి

బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ కోడలు మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ కోడలు మృతి చెందినట్లు తెలుస్తుంది. కన్న లక్ష్మీనారాయణ కుమారుడు ఫణింద్ర భార్య సుహారిక హైద్రబాద్ మాదాపూర్ లోని మీనాక్షి టవర్స్ లో ఉన్న స్నేహితురాలి ఇంటికి వేళ్ళి అక్కడ కుప్పకూలినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమెను హుటాహుటిన రాయదుర్గం ఏఐజీ ఆసుపత్రికి తరలించబోతుండగా మార్గమధ్యం లో ఆమే మృతిచెందినట్టు ఆసుపత్రి వర్గాలు చెప్పినట్టు తెలుస్తుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న మాదాపూర్ పోలీసులు ఆమే మృతిని అనుమానాస్పద మృతిగా కేసు రిజిస్టర్ చెసి దర్యప్తు ప్రారంభించినట్టు మాదాపూర్ ఏ.సి.పి శ్యాం ప్రదాస్ రావు చెప్పుకోచ్చారు. కన్నా కుమారుడు ఫణీంద్ర ఆమే కోడలు నల్లపురెడ్డి సుహారిక ఇద్దిరు 2010లో ప్రేమించి పెళ్ళిచెసుకున్న విషయం తెలిసిందే .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి