iDreamPost

గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య!

కామారెడ్డిలో ఇంటర్ విదార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇదే ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?

కామారెడ్డిలో ఇంటర్ విదార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇదే ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?

గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య!

కామారెడ్డి జిల్లాలో ఇంటర్ విదార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది. వెంటనే అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది ప్రిన్సిపాల్ కు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని యువతిని అలా చూసి ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకుని మృతురాలి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు.

పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం మానేపూర్ గ్రామానికి చెందిన డి.వసుధ (16) అనే విద్యార్థిని మద్నూర్ మండలం పెద్ద ఎక్లార బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే ఇటీవల ఈ బాలిక దసరా సెలవులు రావడంతో ఇంటికి వెళ్లి తాజాగా తిరిగి హాస్టల్ కు చేరుకుంది. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. ఉన్నట్టుండి ఆ విద్యార్థిని వసతి గృహంలోనే ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన తోటి విద్యార్థులు వెంటనే హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు ప్రిన్సిపాల్ కు తెలియజేశారు.

హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని యువతిని అలా చూసి షాక్ గురయ్యారు. అనంతరం ఈ ఘటనపై స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంతా పరిశీలించారు. ఆ తర్వాత యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ విద్యార్థిని మృతికి గల కారణం తెలియాల్సి ఉంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి