iDreamPost

వైఎస్సార్‌సీపీలో చేరిన కదిరి బాబూరావు

వైఎస్సార్‌సీపీలో చేరిన కదిరి బాబూరావు

ఈ రోజు ఉదయం నుంచీ జరుగుతున్న ప్రచారం నిజమైంది. అందరూ ఊహించినట్లుగానే బాలకృష్ణ స్నేహితుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు (కనిగిరి, ప్రకాశం జిల్లా) కొద్దిసేపటి క్రితం వైఎస్సార్‌సీపీలో చేరారు. తాడేపల్లికి వచ్చిన ఆయన సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. పార్టీలో చేరడంపై సుముఖత వ్యక్తం చేశారు. ఆయనకు వైఎస్‌ జగన్‌ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కదిరి బాబూరావు తన వియ్యంకుడు సి.రామచంద్రయ్య, తోట త్రిమూర్తులను తొడ్కొని వెళ్లారు.

Read Also : వైఎస్సార్‌సీపీలోకి బాలకృష్ణ స్నేహితుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి