iDreamPost

హరి హర వీరమల్లు దర్శకుడు మారిపోయాడా.. క్రిష్‌ ప్లేస్‌లోకి!

  • Published Feb 08, 2024 | 8:37 AMUpdated Feb 08, 2024 | 8:37 AM

Hari Hara Veera Mallu Movie: హరి హర వీరమల్లు సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతుంది. ఏంటి అంటే..

Hari Hara Veera Mallu Movie: హరి హర వీరమల్లు సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతుంది. ఏంటి అంటే..

  • Published Feb 08, 2024 | 8:37 AMUpdated Feb 08, 2024 | 8:37 AM
హరి హర వీరమల్లు దర్శకుడు మారిపోయాడా.. క్రిష్‌ ప్లేస్‌లోకి!

క్రిష్‌ డైరెక్షన్‌లో.. పవన్‌ కళ్యాణ్‌ కథానాయకుడిగా రూపొందుతున్న పీరియాడిక్‌ చిత్రం హరి హర వీరమల్లు. 2020లో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. నాలుగేళ్లు కావొస్తున్నా.. ఇప్పటికి సినిమాకు సంబంధించి సరైన అప్డేట్‌ ఒక్కటి కూడా లేదు. మేకర్స్‌ కూడా ఈ మూవీకి సంబంధించి కచ్చితమైన అప్డేట్‌ని ఇవ్వలేకపోతున్నారు. ఎప్పుడో కొన్ని నెలల క్రితం మేకర్స్‌ బీహైండ్‌ సీన్స్‌ వీడియో, అలానే పవన్‌ కళ్యాణ్‌ ట్రైనింగ్‌ తీసుకుంటున్న కొన్ని వీడియోలను రిలీజ్‌ చేశారు. ఆ తర్వాత మళ్లీ ఎలాంటి ప్రకటన లేదు. దాంతో హరి హర వీరమల్లు చిత్రం మేకర్స్‌పై పవన్‌ అభిమానులు చాలా కోపంగా ఉన్నారు.

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా.. అది కూడా పీరియాడికల్‌ డ్రామాగా వస్తోన్న సినిమా అంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి.. వాటికి తగ్గట్టు మేకర్స్‌ కూడా ప్రమోషన్స్‌ చేసుకోవాలి. కానీ హరి హరి వీరమల్లు మేకర్స్‌ మాత్రం ఈ విషయంలో ఫెయిల్‌ అయ్యారని కచ్చితంగా చెప్పవచ్చు. సినిమా తెరకెక్కించే అంశంలో ఆలస్యం కారణంగా మేకర్స్‌ కూడా అప్డేట్స్‌ ఇవ్వడం, ప్రమోషన్‌ కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోవడం లేదని అర్థం అవుతోంది.

Hari Hara Veeramallu director has changed!

మరి సినిమా ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే.. పవన్‌ ఇప్పుడు రాజకీయాలపై దృష్టి పెట్టడం, దాంతో పాటు కథలో మార్పులు చేయడం వల్ల.. హరి హర వీరమల్లు షూటింగ్‌ ఎప్పటికప్పుడు ఆలస్యం అవుతోంది అంటున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా వినిపిస్తోన్న వార్తలు ఏంటి అంటే.. హరి హర వీరమల్లు దర్శకుడు మారిపోయాడంట.

మొదట్లో హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ శరవేగంగా ప్రారంభమైనప్పటికీ పలు సమస్యల కారణంగా అనేక అడ్డంకులు ఎదుర్కొవాల్సి వచ్చింది. పైగా పవన్ కళ్యాణ్ అందించిన షెడ్యూల్‌లోపు.. సినిమాను సరిగా పూర్తి చేయడంలో దర్శకుడు క్రిష్ విఫలమయ్యాడని ఇండస్ట్రీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాక, పవన్ కళ్యాణ్ సినిమాలోని కొన్ని భాగాలపై అసంతృప్తిగా ఉన్నారని, ఇది రీషూట్‌లకు దారితీసిందని అంటున్నారు.

ఈ సృజనాత్మక విభేదాలు, బడ్జెట్ పరిమితులు, పవన్‌ రాజకీయ కార్యక్రమాల వల్ల సినిమా షూటింగ్‌ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. ఇప్పుడు ఏకంగా క్రిష్‌ ఈ సినిమాను డైరెక్ట్‌ చేయడం లేదనే వార్త ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

ఇప్పటికే ఏఎం రత్నం ఈ సినిమా కోసం భారీ ఎత్తున పెట్టుబడి పెట్టారు. త్వరలోనే సినిమా విడుదల అవుతుందని భావిస్తున్న తరుణంలో.. క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలిగినట్లు వార్తలు రావడం సంచలనంగా మారింది. అంతేకాక ప్రస్తుతం క్రిష్‌.. యూవీ క్రియేషన్ బ్యానర్‌లో అనుష్క శెట్టితో కలిసి సినిమా స్టార్ట్‌ చేశారని తెలుస్తోంది. అంతేకాక క్రిష్‌.. ఇకపై హరి హర వీర మల్లు సినిమాను డైరెక్ట్‌ చేయకపోవచ్చని.. ఆయన స్థానంలో కొత్త దర్శకుడుని తీసుకుని సినిమా పూర్తి చేస్తారంటూ ఫిల్మ్‌ నగర్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే దర్శకుడి మార్పుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి