iDreamPost

ఓడిపోయే మ్యాచ్​లో RCB థ్రిల్లింగ్ విక్టరీ.. డుప్లెసిస్ సేన విజయానికి 5 కారణాలు!

  • Published Mar 26, 2024 | 7:59 AMUpdated Mar 26, 2024 | 7:59 AM

ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి విజయాన్ని నమోదు చేసింది. ఫైనల్ ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన హైటెన్షన్ ఫైట్​లో డుప్లెసిస్ సేన 4 వికెట్ల తేడాతో పంజాబ్​ను చిత్తు చేసింది.

ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి విజయాన్ని నమోదు చేసింది. ఫైనల్ ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన హైటెన్షన్ ఫైట్​లో డుప్లెసిస్ సేన 4 వికెట్ల తేడాతో పంజాబ్​ను చిత్తు చేసింది.

  • Published Mar 26, 2024 | 7:59 AMUpdated Mar 26, 2024 | 7:59 AM
ఓడిపోయే మ్యాచ్​లో RCB థ్రిల్లింగ్ విక్టరీ.. డుప్లెసిస్ సేన విజయానికి 5 కారణాలు!

ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. ఫస్ట్ మ్యాచ్​లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ చేతుల్లో ఓడిన ఆర్సీబీ.. రెండో మ్యాచ్​లో బోణీ కొట్టింది. సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్​ను 4 వికెట్ల తేడాతో ఓడించింది డుప్లెసిస్ సేన. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 రన్స్ చేసింది. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన బెంగళూరు 19.2 ఓవర్లలో 178 రన్స్ చేసి విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో ఆర్సీబీ విక్టరీ కొట్టడానికి గల 5 ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

విరాట్ కోహ్లీ

ఆర్సీబీ ముందు మంచి టార్గెట్ ఉంచింది పంజాబ్. స్టార్ బ్యాటర్లతో నిండిన బెంగళూరు ఈ స్కోరు ఛేజ్ చేయడం పెద్ద కష్టం కాదని అంతా అనుకున్నారు. అయితే ఆ జట్టు బ్యాటర్లు చేతులెత్తేశారు. టాప్-6లో విరాట్ కోహ్లీని మినహాయిస్తే ఒక్కరు కూడా కనీసం 20 పరుగుల మార్క్​ను దాటలేకపోయారు. కోహ్లీ (49 బంతుల్లో 77) ఫెంటాస్టిక్ నాక్​తో టీమ్​ను ఆదుకున్నాడు. కింగ్ గనుక పరుగులు చేయకపోతే ఆర్సీబీ అసలు మ్యాచ్​లో ఉండేదే కాదు. అతడు పట్టుదలతో ఆడుతూ చిన్న చిన్న భాగస్వామ్యాలు నమోదు చేయడం వల్లే ఛేజింగ్​లో నిలిచింది. అందుకే బెంగళూరు గెలుపులో అందరికంటే ఎక్కువ క్రెడిట్ కోహ్లీకే ఇవ్వాలి.

RCB Win

దినేష్ కార్తీక్

ఛేజింగ్​లో అప్పటికి బెంగళూరు స్కోరు 130 పరుగులకు 6 వికెట్లు. గెలవాలంటే 22 బంతుల్లో 47 పరుగులు చేయాలి. క్రీజులో మహిపాల్ లోమ్రోర్ లాంటి పెద్దగా అంచనాలు లేని ప్లేయర్ ఉన్నాడు. ఆ టైమ్​లో బరిలోకి దిగాడు దినేష్ కార్తీక్. తన అనుభవం మొత్తాన్ని రంగరించి అద్భుతమైన స్ట్రోక్ ప్లేతో అదరగొట్టాడు. 10 బంతుల్లో 28 పరుగులు చేసి ఓడిపోయే మ్యాచ్​లో ఆర్సీబీకి థ్రిల్లింగ్ విక్టరీని అందించాడు. ఈ మ్యాచ్​లో కోహ్లీ బెంగళూరును నిలిపితే.. కార్తీక్ ఫినిష్ చేశాడు.

RCB Win

 

బౌలర్లు

బెంగళూరు విజయం సాధించడానికి మరో కారణం బౌలర్లు. సీఎస్​కేతో మ్యాచ్​లో చేతులెత్తేసిన ఆర్సీబీ బౌలర్లు.. పంజాబ్​తో మ్యాచ్​లో మాత్రం సత్తా చాటారు. మహ్మద్ సిరాజ్, గ్లెన్ మాక్స్​వెల్ చెరో 2 వికెట్లు తీశారు. యష్ దయాల్ కూడా 1 వికెటే తీసినా పరుగులు కట్టడి చేశాడు. బౌలింగ్ యూనిట్ రాణించడం వల్లే పంజాబ్​ను భారీ స్కోరు చేయకుండా బ్రేకులు వేయగలిగింది ఆర్సీబీ.

ఫాఫ్ డుప్లెసిస్

పంజాబ్​తో మ్యాచ్​లో బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్​లో 3 పరుగులు చేసి ఫెయిలైన డుప్లెసిస్.. కెప్టెన్​గా మాత్రం తన రోల్​ను సరిగ్గా నిర్వర్తించాడు. అందుబాటులో ఉన్న బౌలింగ్ వనరులను కరెక్ట్​గా ఉపయోగించుకున్నాడు. బ్యాటర్ల వీక్​నెస్, అలాగే సిచ్యువేషన్​ను బట్టి బౌలింగ్ ఛేంజెస్ చేశాడు. బ్రేక్​త్రూలు అందించే సత్తా ఉన్న మాక్స్​వెల్​ను అతడు వాడుకున్న తీరు కూడా బాగుంది.

టాస్

ఈ మ్యాచ్​లో టాస్ కూడా కీలకపాత్ర పోషించింది. పిచ్​ మీద తేమను గమనించిన ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ ఛేజింగ్ ఈజీ అవుతుందని భావించాడు. అందుకే టాస్ నెగ్గాక పంజాబ్​ను తొలుత బ్యాటింగ్​కు ఆహ్వానించాడు. అదే టైమ్​లో బెంగళూరు బలం బ్యాటింగ్ కాబట్టి.. ఛేదన చేసేందుకు అతడు మొగ్గు చూపాడు. ఇది కూడా ఆ టీమ్​కు కలసి వచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి