iDreamPost

VIDEO: మాథ్యూస్​ను బ్యాట్​తో కొట్టిన కోహ్లీ.. లంక ప్లేయర్ రియాక్షన్ వైరల్!

  • Author singhj Published - 10:07 PM, Thu - 2 November 23

శ్రీలంక సీనియర్ ప్లేయర్ ఏంజెలో మాథ్యూస్​ను విరాట్ కోహ్లీ బ్యాట్​తో కొట్టడం చర్చనీయాంశంగా మారింది. కోహ్లీ కొట్టాక మాథ్యూస్ ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

శ్రీలంక సీనియర్ ప్లేయర్ ఏంజెలో మాథ్యూస్​ను విరాట్ కోహ్లీ బ్యాట్​తో కొట్టడం చర్చనీయాంశంగా మారింది. కోహ్లీ కొట్టాక మాథ్యూస్ ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Author singhj Published - 10:07 PM, Thu - 2 November 23
VIDEO: మాథ్యూస్​ను బ్యాట్​తో కొట్టిన కోహ్లీ.. లంక ప్లేయర్ రియాక్షన్ వైరల్!

వన్డే వరల్డ్ కప్-2023లో టీమిండియా వరుసగా ఏడో విజయం సాధించింది. ముంబైలోని వాంఖడే స్డేడియంలో గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో రోహిత్ సేన ఏకంగా 302 పరుగుల భారీ తేడాతో విజయాన్ని నమోదు చేసింది. వన్డే క్రికెట్​లో రన్స్ పరంగా భారత్​కిది నాలుగో అదిపెద్ద విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్​లో టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన టీమిండియా 50 ఓవర్లలో 357 రన్స్ చేసింది. భారీ టార్గెట్ ఛేజింగ్​లో భారత బౌలర్ల ధాటికి శ్రీలంక 19.4 ఓవర్లలో 55 రన్స్​కే కుప్పకూలింది. ఆ టీమ్​లో కాసున్ రజిత (14) టాప్ స్కోరర్. ఏంజెలో మాథ్యూస్ (12), తీక్షణ (12) పరుగులు చేశారు.

రజిత, మాథ్యూస్, తీక్షణను మినహాయిస్తే మిగిలిన లంక బ్యాటర్లంతా సింగిల్ డిజిట్​కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో మహ్మద్ షమి 5 వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు 3 వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్ ప్రత్యర్థి బ్యాటర్లను గడగడలాడించారు. జస్​ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాకు ఒక్కో వికెట్ దక్కింది. టీమిండియా బౌలర్లు చెలరేగడంతో లంక బ్యాటర్లలో ఏకంగా ఐదుగురు డకౌట్ అయ్యారు. పాథుమ్ నిశాంక, దిముత్ కరుణరత్నె, దుషాన్ హేమంతలు ఆడిన తొలి బాల్​కే వెనుదిరిగారు. సదీర సమరవిక్రమ, దుష్మంత చమీర కూడా గోల్డెన్ డక్ అయ్యారు.

టీమిండియా బ్యాటర్లలో ఓపెనర్ రోహిత్ శర్మ (4) ఈసారి ఫెయిలయ్యాడు. వన్​డౌన్​లో వచ్చిన విరాట్ కోహ్లీ (94 బంతుల్లో 88) మరో ఓపెనర్ శుబ్​మన్ గిల్ (92 బంతుల్లో 92)తో కలసి ఇన్నింగ్స్​ను నిలబెట్టాడు. వీళ్లిద్దరితో పాటు మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (56 బంతుల్లో 82) కూడా రాణించాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అయ్యర్ ఏకంగా 6 సిక్సర్లు బాదాడు. చివర్లో జడేజా (35) కూడా రాణించడంతో టీమ్ భారీ స్కోరు చేయగలిగింది. అయితే ఈ మ్యాచ్​లో భారత ఇన్నింగ్స్​ టైమ్​లో విరాట్ కోహ్లీ చేసిన ఒక పని వైరల్ అవుతోంది.

ఫీల్డ్​లో ఎంతో యాక్టివ్​గా ఉండే కోహ్లీ లంక సీనియర్ ఆల్​రౌండర్ ఏంజెలో మాథ్యూస్​ను ఆటపట్టించాడు. భారత ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేసిన మాథ్యూస్ బౌలింగ్​లో ఫస్ట్ బాల్​ను లెగ్​సైడ్ ఆడాడు కోహ్లీ. ఈ క్రమంలో సింగిల్ తీసేందుకు పరిగెత్తుకుంటూ వెళ్లిన కోహ్లీ.. తన చేతిలో ఉన్న బ్యాట్​తో మాథ్యూస్​ను వెనుక నుంచి కొట్టాడు. దీంతో మాథ్యూస్ నవ్వాపుకోలేకపోయాడు. మాథ్యూస్​ను కోహ్లీ బ్యాట్​తో కొట్టిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇదే మ్యాచ్​లో గిల్​ను కూడా సరదాగా కొట్టాడు కోహ్లీ. మరి.. తోటి క్రికెటర్స్​ను కోహ్లీ ఆటపట్టించడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి ఔటైన అయ్యర్‌! అతియా శెట్టి రియాక్షన్‌ చూడండి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి