Nidhan
రిజల్ట్ గురించి పక్కనబెడితే ప్రయోగాలు అనేది నిత్యం చేస్తూనే ఉండాలి. కానీ అవి ప్లేయర్ల మెంటల్ ఎబిలిటీని, కాన్ఫిడెన్స్ను దెబ్బతీసేలా ఉండకూడదు. భారత టీమ్ మేనేజ్మెంట్ చేస్తున్న ప్రయోగాలు బెడిసికొడుతున్నాయి.
రిజల్ట్ గురించి పక్కనబెడితే ప్రయోగాలు అనేది నిత్యం చేస్తూనే ఉండాలి. కానీ అవి ప్లేయర్ల మెంటల్ ఎబిలిటీని, కాన్ఫిడెన్స్ను దెబ్బతీసేలా ఉండకూడదు. భారత టీమ్ మేనేజ్మెంట్ చేస్తున్న ప్రయోగాలు బెడిసికొడుతున్నాయి.
Nidhan
ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ విక్టరీతో జోష్లో ఉన్న టీమిండియా ఎన్నో ఆశలతో సౌతాఫ్రికా గడ్డ మీద అడుగుపెట్టింది. అయితే ప్రొటీస్తో జరగాల్సిన మొదటి టీ20 వర్షం వల్ల రద్దయింది. డర్బన్లో జరగాల్సిన ఈ మ్యాచ్కు వరుణుడు అడ్డుతగిలాడు. రెండో టీ20కీ వాన ఆటంకం కలిగించింది. కానీ ఎట్టకేలకు డక్వర్త్ లూయిస్ పద్ధతిలో పూర్తి చేసిన ఈ మ్యాచ్లో భారత్ ఓడిపోయింది. సఫారీ సిరీస్ను ఓటమితో మొదలుపెట్టింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (56), రింకూ సింగ్ (68 నాటౌట్) అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఆ తర్వాత ప్రొటీస్ టార్గెట్ను డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 15 ఓవర్లకు 152గా సవరించారు.
టీమిండియా నిర్దేశించిన టార్గెట్ను సౌతాఫ్రికా 13.5 ఓవర్లలోనే అందుకుంది. ఒక దశలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో సఫారీ టీమ్ ఓడిపోతుందని అనిపించింది. కానీ డేవిడ్ మిల్లర్ (17), స్టబ్స్ (14 నాటౌట్) కూల్గా బ్యాటింగ్ చేస్తూ టీమ్ను టార్గెట్ దిశగా నడిపించారు. ఆఖర్లో మిల్లర్ ఔటైనా.. ఫెలుక్వాయో (10 నాటౌట్), స్టబ్స్ మిగిలిన పని పూర్తి చేశారు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో భారత టీమ్ కాంబినేషన్పై విమర్శలు వస్తున్నాయి. జట్టు కూర్పుపై సోషల్ మీడియాలో నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. ఎంతో టాలెంట్ ఉన్న రుతురాజ్ గైక్వాడ్ లాంటి వారిని టీమ్లోకి తీసుకోకుండా ద్రవిడ్ అండ్ టీమ్ మేనేజ్మెంట్ తప్పు చేసిందని అంటున్నారు. అనవసర ప్రయోగాలకు వెళ్లి యంగ్స్టర్స్ కెరీర్తో ఆడుకుంటున్నారని ఫైర్ అవుతున్నారు.
రీసెంట్గా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్లో పేస్ ఆల్రౌండర్ శివమ్ దూబే, స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను స్క్వాడ్లోకి తీసుకున్నారు. కానీ వాళ్లిద్దర్నీ ఒక్క మ్యాచ్లో కూడా బరిలోకి దింపలేదు. అందులో నుంచి సుందర్ను సౌతాఫ్రికా సిరీస్కు తీసుకున్నారు. కానీ దూబేను మాత్రం సెలక్ట్ చేయలేదు. కంగారూలతో సిరీస్లో అదరగొట్టిన మరో స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను కూడా సఫారీ టూర్కు ఎంపిక చేయలేదు. మరోవైపు బాగా రాణిస్తున్న రుతురాజ్ గైక్వాడ్ను పక్కన పెట్టి సౌతాఫ్రికాతో రెండో టీ20లో శుబ్మన్ గిల్ను ఆడించారు. ఆసీస్తో టీ20 సిరీస్లో రుతురాజ్ సెంచరీతో ఆకట్టుకున్నా అతడ్ని బెంచ్కే పరిమితం చేస్తున్నారు. అతడి ప్లేసులో వచ్చిన గిల్ టీ20 ఇంటర్నేషనల్ రికార్డులు బాగోలేదు.
మరో టాలెంటెడ్ యంగ్స్టర్ ఇషాన్ కిషాన్ విషయంలోనూ టీమ్ మేనేజ్మెంట్ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. తనకు వచ్చిన ప్రతి ఛాన్స్ను సద్వినియోగం చేసుకుంటూ రాణిస్తున్న ఇషాన్ను సౌతాఫ్రికాతో సెకండ్ టీ20లో ఆడించలేదు. ప్రయోగాల పేరుతో ఇష్టం వచ్చినట్లు ప్లేయర్లను మార్చడం ఏంటనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. టీమ్ కాంబినేషన్ విషయంలో ఇలాగే వ్యవహరిస్తే యంగ్స్టర్స్ నమ్మకం కోల్పోతారని చెబుతున్నారు. ఇలాగైతే మరో వరల్డ్ కప్ కూడా మన చేతి నుంచి జారిపోవడం ఖాయమని అంటున్నారు. మరి.. ప్రయోగాల పేరుతో యంగ్స్టర్స్ను పక్కనబెట్టడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: మాక్ చికెన్ తింటూ కోహ్లీ పోస్ట్! వెజిటేరియన్ కదా అంటూ కొత్త రచ్చ!