Nidhan
ఆఫ్ఘానిస్థాన్తో జరిగిన తొలి టీ20లో శివమ్ దూబే దుమ్మరేపాడు. తన ఆల్రౌండర్ ఎబిలిటీస్తో టీమ్కు విక్టరీని అందించాడు. అలాంటి దూబేపై మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ఆఫ్ఘానిస్థాన్తో జరిగిన తొలి టీ20లో శివమ్ దూబే దుమ్మరేపాడు. తన ఆల్రౌండర్ ఎబిలిటీస్తో టీమ్కు విక్టరీని అందించాడు. అలాంటి దూబేపై మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Nidhan
ఆఫ్ఘానిస్థాన్తో మూడు టీ20ల సిరీస్ను టీమిండియా సూపర్బ్గా స్టార్ట్ చేసింది. ఈ రెండు టీమ్స్ మధ్య మొహాలీ వేదికగా గురువారం రాత్రి జరిగిన తొలి టీ20లో రోహిత్ సేన 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ నెగ్గిన భారత కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘాన్ ఓవర్లన్నీ ఆడి 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ముకేష్ కుమార్, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లతో ఆకట్టుకున్నారు. బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్పై పర్యాటక జట్టు విసిరిన టార్గెట్ను టీమిండియా 17.3 ఓవర్లలో ఛేజ్ చేసేసింది. శివమ్ దూబె (60 నాటౌట్), జితేష్ శర్మ (31) రాణించడంతో ఈజీగా గెలుపు తీరాలకు చేరుకుంది. అయితే మ్యాచ్ తర్వాత ఆల్రౌండర్ దూబేతో మాజీ క్రికెటర్ సురేష్ రైనా కాసేపు మాట్లాడాడు. ఈ సందర్భంగా రైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సీఎస్కే కెప్టెన్ ధోని ఇది చూస్తే పరిస్థితి ఏంటన్నాడు.
భారత్-ఆఫ్ఘాన్ మధ్య జరిగిన తొలి టీ20లో కామెంటేటర్గా వ్యవహరించాడు రైనా. మ్యాచ్ ముగిసిన తర్వాత దూబేతో పాటు కుల్దీప్ యాదవ్, రింకూ సింగ్తో కలసి ముచ్చటిస్తూ, సెల్ఫీలు దిగుతూ కనిపించాడు. ఈ క్రమంలో దూబేతో చిట్చాట్ సందర్భంగా అతడు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఫస్ట్ టీ20లో 2 ఓవర్లు వేసిన దూబె 9 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు. కీలక సమయంలో ప్రత్యర్థి జట్టు కెప్టెన్ ఇబ్రహీం జాద్రాన్ (25)ను ఔట్ చేశాడతను. ఈ విషయాన్ని చిట్చాట్ సందర్భంగా ప్రస్తావనకు తీసుకొచ్చాడు రైనా. ‘ఇవాళ మ్యాచ్లో నీ బౌలింగ్ను గనుక ధోని భాయ్ చూస్తే వచ్చే ఐపీఎల్ సీజన్లో నీకు 3 ఓవర్లు ఇవ్వడం ఖాయం’ అని రైనా అన్నాడు. దీనికి దూబె స్పందిస్తూ.. ‘రైనా భాయ్ చెప్పింది వింటున్నారా మాహీ భాయ్’ అని చెప్పాడు. దీంతో ఇద్దరూ నవ్వుల్లో మునిగిపోయారు.
ఇక, బ్యాటింగ్ ఆల్రౌండర్గా పేరు తెచ్చుకున్న శివమ్ దూబేకు భారత జట్టులో అంతగా అవకాశాలు రావడం లేదు. అతడ్ని ఎక్కువగా బెంచ్కే పరిమితం చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా టీ20 సిరీస్తో పాటు సౌతాఫ్రికా టూర్లోనూ ఈ పొడగరి ప్లేయర్ను పక్కన పెట్టారు. దీంతో ఆఫ్ఘాన్ సిరీస్లోనూ ఆడించడం కష్టమేనని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా తొలి టీ20లోనే దూబేను బరిలోకి దింపాడు కెప్టెన్ రోహిత్ శర్మ. అతడి నమ్మకం వృథా కాలేదు. బౌలింగ్లో కీలక వికెట్తో బ్రేక్ త్రూ అందించిన దూబె.. బ్యాట్తోనూ చెలరేగిపోయాడు. 40 బంతుల్లో 60 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఆఖరి వరకు పట్టుదలతో బ్యాటింగ్ చేసి విన్నింగ్ షాట్తో మ్యాచ్ను ఫినిష్ చేశాడు. ఈ నేపథ్యంలో రైనా అతడ్ని మెచ్చుకున్నాడు. ఈ మ్యాచ్లో అతడి బౌలింగ్ను గనుక ధోని చూస్తే ఇక అంతేనని.. సీఎస్కే తరఫున ఐపీఎల్లో ఆడినప్పుడు 3 ఓవర్లు ఇవ్వడం పక్కా అన్నాడు. మరి.. రైనా చెప్పినట్లు ఐపీఎల్లో దూబేకు ధోని బౌలింగ్ చేసే ఛాన్స్ ఇస్తాడని మీరు భావిస్తున్నట్లయితే కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: టీమ్లోకి తీసుకోవడమే దండగ అన్నారు! అతనే గెలిపించాడు!
Suresh Raina – If Mahi bhai saw your bowling tonight then your 3 overs are fixed for CSK this season (laughs).
Dube – Mahi bhai please listen to Raina bhai (smiles). pic.twitter.com/dhOlgQVaYc
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 11, 2024