iDreamPost

కార్యాలయాలపై వైకాపా రంగులను తొలగించండి : హైకోర్టు

కార్యాలయాలపై వైకాపా రంగులను తొలగించండి : హైకోర్టు

పంచాయతీ కార్యాలయాలపై వైకాపా రంగులను తొలగించాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పంచాయతీ కార్యాలయాలకు వైకాపా రంగులను వేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. పంచాయతీ ఎన్నికలు వస్తున్నందున పార్టీ రంగులు కార్యాలయాలపై తొలగించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. పంచాయతీ కార్యాలయాలు ప్రభుత్వానివని, వాటికి పార్టీ రంగులు ఉండకూడదని ధర్మాసనం తేల్చి చెప్పింది. కార్యాలయాలకు రంగుల తొలగింపు వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యత తీసుకోవాలని సూచించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 5 కు వాయిదా పడింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి