టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గత కొన్ని రోజులుగా స్తబ్దత నెలకొంది. కొత్తగా రిలీజైన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా జోరు చూపించడం లేదు. జులై నెలలో విడుదలైన ‘సామజవరగమన’, ‘బేబీ’ మూవీస్ వసూళ్ల వర్షం కురిపించాయి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కలసి నటించిన ‘బేబీ’ అయితే డబుల్ బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇప్పటికే రూ.80 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టిన ఈ మూవీ.. రూ.100 కోట్ల మార్క్ను అందుకునే దిశగా దూసుకెళ్తోంది. గత నెలాఖరులో విడుదలైన పవన్ కల్యాణ్ మూవీ ‘బ్రో’ యావరేజీగా నిలిచింది. తొలి మూడ్రోజులు కలెక్షన్ల మోత మోగించిందీ చిత్రం.
నాలుగో రోజు నుంచి ‘బ్రో’ మూవీ వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఫైనల్ రన్ పూర్తయితే గానీ ఈ సినిమా నష్టాల బారి నుంచి తప్పించుకుంటుందో లేదో చెప్పలేం. మరో ఐదు రోజుల వరకు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసే పెద్ద సినిమాలు లేవు. మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’, తలైవా రజినీకాంత్ ‘జైలర్’ సినిమాలు ఈ వీకెండ్లో రిలీజ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఓటీటీ ఆడియెన్స్ను అలరించేందుకు ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వచ్చేస్తోంది. యంగ్ హీరో అశ్విన్ బాబు కథానాయకుడిగా కన్నెగంటి అనిల్ తెరకెక్కించిన సినిమా ‘హిడింబ’. రీసెంట్గా రిలీజైన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది.
కొత్త కాన్సెప్ట్తో రూపొందిన ‘హిడింబ’ మూవీలో హీరో అశ్విన్బాబు యాక్టింగ్కు మంచి మార్కులు పడ్డాయి. హీరోయిన్ నందిత శ్వేత నటనను కూడా ప్రేక్షకులు మెచ్చుకున్నారు. ఇందులో శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, రఘు కుంచె, దీప్తి నల్లమోతు కీలక పాత్రల్లో కనిపించారు. అయితే ఈ మూవీ అనుకున్నంత రేంజ్లో మాత్రం హిట్ కాలేదు. అలాంటి ‘హిడింబ’ ఓటీటీ రిలీజ్కు రెడీ అవుతోంది. ఆగస్టు 10వ తేదీన రాత్రి 7 గంటలకు ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. థ్రిల్లర్ సినిమాలను చూసేవారికి ‘హిడింబ’ నచ్చే ఛాన్స్ ఉంది.