iDreamPost

కరోనా వల్ల రెండేళ్ల తర్వాత తల్లిని కలుసుకున్న హీరోయిన్

కరోనా వల్ల రెండేళ్ల తర్వాత తల్లిని కలుసుకున్న హీరోయిన్

కరోనా వల్ల చాలా మంది ఫ్యామిలీలలో ఒకరు ఒక చోట ఇంకొకరు ఇంకోచోట ఉండిపోయిన సందర్భాలు చాలా చూశాం. అలా నెలల తరబడి ఇంటికి దూరంగా అయినవాళ్ళకి దూరంగా లాక్ డౌన్ వల్ల ఎక్కడికి వెళ్లలేక ఉన్నారు. లాక్ డౌన్ ఎత్తేయగానే చాలా మంది ముందు తమ ఇళ్ళకి, తమ వాళ్ళ దగ్గరికి వెళ్లిపోయారు. అయితే ఈ హీరోయిన్ మాత్రం ఏకంగా రెండేళ్లు తన ఫ్యామిలీకి దూరంగా ఉంది కరోనా వల్ల.

యువ హీరో నాగశౌర్య నటించిన ‘కృష్ణ వ్రిందా విహారి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమవనుంది హీరోయిన్ షెర్లీ సేథియా. షెర్లీ భారత్ లో పుట్టి న్యూజిలాండ్ లో సెటిల్ అయిన ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి. యాక్టర్ కంటే ముందు షెర్లీ సింగర్ కూడా. బాలీవుడ్ లో 2020లో మస్కా అనే సినిమాతో సినీ పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కృష్ణ వ్రిందా విహారి, బాలీవుడ్ లో ‘నికమ్మ’ అనే సినిమాలు చేసింది. ఆ రెండు సినిమాలు ప్రస్తుతం రిలీజ్ కి రెడీగా ఉన్నాయి.

అయితే ఇన్ని రోజులు కరోనా లాక్ డౌన్ వల్ల ఇక్కడే ఉండిపోయింది షెర్లీ. మస్కా సినిమా కోసం వచ్చి ఇక్కడే ఉండిపోయింది. మన దేశంలో లాక్ డౌన్ ఎత్తేసినా గత కొన్ని రోజుల వరకు కూడా వేరే దేశాల ప్రయాణానికి ఇంకా ఆంక్షలు కొనసాగుతుండటంతో షెర్లీ న్యూజిలాండ్ వెళ్ళలేదు. వాళ్ల పేరెంట్స్ కూడా ఇక్కడికి రాలేదు. ప్రస్తుతం షెర్లీ చేసిన నికమ్మ సినిమా జూన్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో తాజాగా షెర్లీ తల్లి ఇండియాకి వచ్చింది.

న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌ నుంచి ఇండియాకు వచ్చిన తన తల్లిని రిసీవ్‌ చేసుకునేందుకు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి అక్కడ తన తల్లితో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజా ప్రమోషన్స్ లో తన తల్లి గురించి మాట్లాడుతూ.. నా సినిమా విడుదల కానున్న సందర్భంగా నా తల్లిదండ్రులు నా కోసం ఇండియాకు వస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. వాళ్ళని నేను కరోనాకు ముందు 2020లో చివరిసారిగా కలిశాను. చాలాకాలం గడిచింది. ఈ జూన్‌ 17 నాకు చాలా పెద్ద రోజు. త్వరలో మా నాన్న కూడా రానున్నారు అని తెలిపింది.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి