iDreamPost

జేసికి మరో జెల్ల !!సెక్యూరిటీ ని ఉపసంహరించిన సర్కార్ …

జేసికి మరో జెల్ల !!సెక్యూరిటీ ని ఉపసంహరించిన సర్కార్ …

జగన్ గవర్నమెంట్ వచ్చాక మిగిస్తా టిడిపి లీడర్ల సంగతి ఎలా ఉన్నాగానీ అనంతపురం జిల్లా సీనియర్ లీడర్ జేసీ దివాకర్ రెడ్డి పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. తెల్లారిందంటే చాలు ఈ రోజు ఎలా గడుస్తుందా, జగన్ గవర్నమెంట్ తన విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పెడుతుందా అని భయపడుతూ కాలం గడిపే పరిస్థితికి వచ్చింది.

మైనింగ్ లీజులు రద్దు చేయడం, బస్సులు సీజ్ చేయడం ,ఫోర్జరీ కేసులు బుక్ చేయడం తో జేసీ బ్రదర్స్ ఇప్పటికే సగం పరువు, మర్యాద, పెద్దరికం చివరకు వందలకోట్ల ఆదాయం కోల్పోయారు. ఇక ఇప్పుడు తాజాగా పర్సనల్ భద్రత విషయంలో కూడా దెబ్బ పడింది.

జేసీ దివాకర్ రెడ్డికి ఉన్న ప్రభుత్వ సెక్యూరిటీని నిలిపివేస్తూ వైసీపీ ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. దివాకర్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయాక ఇంటికే పరిమితం అయ్యారు. ఇక ఈ నేపధ్యంలో గన్‌‌మెన్‌ ను 2+2 నుంచి 1+1 కు ఏపీ ప్రభుత్వం కుదించింది. ఇక తాజాగా ఆయన భద్రత కోసం కేటాయించిన 1+1 గన్‌మెన్లను కూడా పూర్తిగా తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో దివాకర్ పరువు పూర్తిగా తీసేసినట్లు అయింది. పలువురు శత్రువులను, కేసులను మూటగట్టుకున్న దివాకర్ రెడ్డి భద్రత లేకుండా బయటకు ఎలా వెళ్తారో ఇక చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి