iDreamPost

డాక్టర్‌కి కరోనా.. క్వారంటైన్‌కు 12 మంది వైద్యులు..

డాక్టర్‌కి కరోనా.. క్వారంటైన్‌కు 12 మంది వైద్యులు..

ఏపీలోని గుంటూరు నగరంలో క‌రోనా తీవ్ర‌త రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా కరోనా బాధితులకు ట్రీట్ మెంట్ చేస్తున్న మ‌హిళా డాక్టర్‌కి కరోనా సోకింది. దీంతో ముందుస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లాలో కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న 12 మంది డాక్టర్లను అధికారులు క్వారంటైన్‌కు తరలించారు.

కాగా గుంటూరులో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండగా.. వారికి వైద్యం అందిస్తోన్న 54 మంది డాక్టర్లు, సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో నలుగురి రిపోర్ట్‌ రాగా, అందులో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరో 50 మంది కరోనా పరీక్షల రిపోర్టులు రావాల్సి ఉంది. నగరంలోని ఓ ప్రైవేటు లాడ్జీని క్వారంటైన్‌ కేంద్రంగా మార్చిన అధికారులు.. డాక్టర్లు, వైద్య సిబ్బందిని అక్కడికి తరలించారు. 

మరోవైపు మహిళా డాక్టర్ వర్కింగ్ లేడీస్ హాస్టల్‌లో ఉంటుండగా.. ఆ హాస్టల్‌లో ఉన్న 35 మంది మహిళలను క్వారంటైన్‌కు తరలించారు. జిల్లాలో ఇప్పటివరకు ఒక మెడికో సహా ఇద్దరు ఆర్‌ఎంపీలకు కరోనా సోకినట్టుగా అధికారులు వెల్లడించారు. దీంతో ఇద్దరు ఆర్‌ఎంపీల దగ్గర వైద్యం చేయించుకున్న దాదాపు 190 మందిని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 126 కి చేరుకున్నాయి. అత్యధికంగా కర్నూలులో 129 మందికి వైరస్ సోకింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి