iDreamPost
android-app
ios-app

RGV చనిపోయాకే ఆయన విలువ తెలుస్తుంది.. డైరెక్టర్ అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్

  • Author Soma Sekhar Published - 09:23 PM, Sat - 25 November 23

రామ్ గోపాల్ వర్మ చనిపోయాకే ఆయన విలువ తెలుస్తుందని షాకింగ్ కామెంట్స్ చేశాడు డైరెక్టర్ అజయ్ భూపతి. మరి ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.

రామ్ గోపాల్ వర్మ చనిపోయాకే ఆయన విలువ తెలుస్తుందని షాకింగ్ కామెంట్స్ చేశాడు డైరెక్టర్ అజయ్ భూపతి. మరి ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Author Soma Sekhar Published - 09:23 PM, Sat - 25 November 23
RGV చనిపోయాకే ఆయన విలువ తెలుస్తుంది.. డైరెక్టర్ అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్

రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు తెలియని వారు ఇండస్ట్రీలో ఉండరు అంటే అతిశయోక్తికాదు. ఎప్పుడూ విమర్శలు, వివాదాలతో సావాసం చేస్తాడు ఈ స్టార్ డైరెక్టర్. ఇక ఇతడి దగ్గర శిష్యరికం చేసిన ఎంతో మంది ఇప్పుడు స్టార్ డైరెక్టర్లుగా పరిశ్రమలో కొనసాగుతున్నారు. అందులో డైరెక్టర్ అజయ్ భూపతి ఒకడు. ‘RX 100’ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు. ఈ మూవీతో అతడి పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోయింది. తాజాగా పాయల్ రాజ్ లీడ్ రోల్ లో ‘మంగళవారం’ అనే సినిమాను తెరకెక్కించాడు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఇక మూవీ సక్సెస్ కావడంతో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు అజయ్ భూపతి. ఈ క్రమంలోనే ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురువు రామ్ గోపాల్ వర్మ గురించి పలు షాకింగ్ విషయాలు వెల్లడించాడు.

అజయ్ భూపతి.. ‘మంగళవారం’ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. తాజాగా విడుదలైన ఈ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ థియేటర్లలో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ గురించి షాకింగ్ విషయాలు వెల్లడించాడు. డైరెక్టర్ అజయ్ భూపతి మాట్లాడుతూ..”తన పని తాను చేసుకుంటూ పక్కొడి పని గెలకగలిగే కెపాసిటీ ఆర్జీవీకి ఉంది. ఆయన ఏ సమయంలో ఎలా ఉంటాడు? ఏం చేస్తాడు? ఎవరి మీద సెటైర్ వేస్తాడో ఎవ్వరికీ తెలీదు. ‘ఎటాక్’ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు షాట్ రెడీ అయిపోయింది అన్నప్పుడు ఆయన 5నిమిషాలు అని ట్విట్టర్ లో మమ్ముట్టిని తిట్టాడు. దీంతో మేమందరం షాక్ కు గురైయ్యాం.

మేము ఆయన పక్కనే రోజంతా ఉన్నా.. ఆయన పెట్టే ట్వీట్స్ మాకు ఎవ్వరికీ తెలీవు. ప్రపంచం మెుత్తం చూసినప్పుడే మేం కూడా వాటిని చూస్తాం. సెట్ లో అందరిని సమానంగా గౌరవిస్తాడు, చూస్తాడు. ఆర్జీవీ ముందే సిగరెట్ కాల్చినా ఏమీ అనడు. ఆయన లాంటి మస్తత్వం ఉన్న వ్యక్తి నా దృష్టిలో మరొకరు ఉండరు. ఇప్పుడు ఎవ్వరికీ ఆయన విలువ తెలీయట్లేదని ఆర్జీవీ మరణించాకే ఆయన విలువ తెలుస్తుంది” అంటూ ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అజయ్ భూపతి. ఇక పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ లో నటించిన ‘మంగళవారం’ సూపర్ హిట్ టాక్ తో థియేటర్ల దగ్గర దూసుకెళ్తోంది. భారీ వసూళ్లను సాధిస్తూ.. బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఈ సినిమాకు ముందు శర్వానంద్, సిద్దార్థ్ లతో ‘మహా సముద్రం’ అనే సినిమాను తీశాడు. కానీ ఆ మూవీ సరిగ్గా ఆడలేదు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు డైరెక్టర్ అజయ్ భూపతి. మరి ఆర్జీవీ గురించి మంగళవారం డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి