iDreamPost

IND vs SA: టీమిండియా ప్లేయర్లతో ఫ్లైట్ ఎక్కిన మిస్టరీ గర్ల్.. ఎవరో తెలుసా?

  • Author Soma Sekhar Published - 07:24 PM, Fri - 8 December 23

సౌతాఫ్రికా టూర్ కోసం యంగ్ టీమిండియా ఆ గడ్డపై అడుగుపెట్టింది. అయితే ఫ్లైట్ లో టీమిండియా ప్లేయర్లతో పాటుగా ఓ అమ్మాయి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ మిస్టరీ గర్ల్ ఎవరో? ఇప్పుడు తెలుసుకుందాం.

సౌతాఫ్రికా టూర్ కోసం యంగ్ టీమిండియా ఆ గడ్డపై అడుగుపెట్టింది. అయితే ఫ్లైట్ లో టీమిండియా ప్లేయర్లతో పాటుగా ఓ అమ్మాయి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ మిస్టరీ గర్ల్ ఎవరో? ఇప్పుడు తెలుసుకుందాం.

  • Author Soma Sekhar Published - 07:24 PM, Fri - 8 December 23
IND vs SA: టీమిండియా ప్లేయర్లతో ఫ్లైట్ ఎక్కిన మిస్టరీ గర్ల్.. ఎవరో తెలుసా?

వరల్డ్ కప్ ముగిసిన తర్వాత టీమిండియా వరుస సిరీస్ లతో బిజీగా ఉంది. ఇప్పటికే ఆసీస్ తో టోర్నీ దిగ్విజయంగా ముగించుకున్న భారత జట్టు.. వెంటనే సౌతాఫ్రికా టూర్ కు బయలుదేరింది. ఈ సిరీస్ లో భాగంగా ప్రోటీస్ జట్టుతో 3 టీ20, 3 వన్డే, రెండు టెస్టు మ్యాచ్ లు ఆడనుంది. ఇందుకోసం దక్షిణాఫ్రికాలో లాండ్ అయ్యారు టీమిండియా ప్లేయర్లు. అక్కడ వారికి ఘన స్వాగతం కూడా లభించింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. టీమిండియా ప్లేయర్లతో పాటుగా ఓ బ్యూటీ కూడా ఫ్లైట్ లో కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో.. భారత ఆటగాళ్లతో ఉన్న ఆ మిస్టరీ గర్ల్ ఎవరు? అంటూ నెటిజన్లు ఆరా తీయ్యడం మెుదలుపెట్టారు. మరి ఆ బ్యూటీ ఎవరో ఇప్పుడు చూద్దాం.

యంగ్ టీమిండియా దక్షిణాఫ్రికా టూర్ కు బయలుదేరినప్పుడు భారత జట్టు స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ ఫ్లైట్ లో దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ పిక్ లో రింకూతో పాటుగా అర్షదీప్, కుల్దీప్ మరికొందరు సహచర ఆటగాళ్లు ఉన్నారు. వారితో పాటుగా ఓ మిస్టరీ గర్ల్ కూడా ఉంది.ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. టీమిండియా ప్లేయర్లతో ఉన్నా ఆ బ్యూటీ ఎవరు? అంటూ నెటిజన్లు సెర్చ్ చేయడం మెుదలుపెట్టారు. తొలుత ఆమెను ఎయిర్ లైన్స్ సిబ్బంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆమె ఫ్లైట్ సిబ్బంది కాదు. గతంలో కూడా ఆమె టీమిండియా ప్లేయర్లతో దర్శనమిచ్చింది. దీంతో జట్టుతో తిరుగుతున్న ఈ బ్యూటీ ఎవరా? అని ఆరా తీస్తున్నారు.

who is that girl

భారత జట్టుతో పాటు సౌతాఫ్రికాకు వెళ్లిన ఈ బ్యూటీ పేరు రాజల్ అరోరా. ఆమె టీమిండియాకు అలాగే ఐపీఎల్ డిజిటల్ మీడియా మేనేజర్ గా పనిచేస్తోంది. గత 8 సంవత్సరాలుగా రాజల్ అరోరా బీసీసీఐలో పనిచేస్తోంది. ఆమె పూణేలోని సింబయాసిస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ కమ్యూనికేషన్ పూర్తి చేసింది. 2015 నుంచి రాజల్ BCCIలో విధులు నిర్వర్తిస్తూ వస్తోంది. గతంలో విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మలతో కలిసి అనేక పర్యటనల్లో మెరిసింది ఈ ముద్దుగుమ్మ. తొలుత టీ20 మ్యాచ్ ల కోసం యంగ్ ప్లేయర్లు సఫారీ గడ్డపై అడుగుపెట్టారు. డిసెంబర్ 10 తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది.

 

View this post on Instagram

 

A post shared by Rajal Arora 🫶 (@rajal_arora)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి