iDreamPost

Crime News భార్య కోసం ఇద్ద‌రి భర్త‌ల‌ ఫైట్, మొద‌టి మొగుడి కిడ్నాప్

Crime News భార్య కోసం ఇద్ద‌రి భర్త‌ల‌ ఫైట్, మొద‌టి మొగుడి కిడ్నాప్

ఏడుగురు ముఠాతో ఆదివారం రాత్రి కదూరికి వచ్చిన ఓం ప్రకాష్ త‌న భార్య మొద‌టి భ‌ర్త‌ మోహన్ రామ్‌ని సినిమా స్టైల్లో అపహరించారు. నోట్లో గుడ్డ‌లు క‌క్కి కార్ లో కిడ్నాప్ చేశారు. కాని, అత‌ని అరుపులకు స్థానికి అప్ర‌మ‌త్త‌మ‌వ్వ‌డం, కారు ఆగిపోవ‌డంతో ముఠా దొరికిపోయింది.

భార్య మంజుల‌కు మెసేజ్ చేస్తున్న మొద‌టి భ‌ర్త‌ను హ‌త్య‌చేయ‌డానికి రెండోభ‌ర్త‌ కిడ్నాప్ చేయ‌డానికి ప్లాన్ చేశాడు. చిక్కమగళూరు జిల్లా, కడూరులో జరిగింది. ఐదేళ్ల క్రితం రాజస్థాన్ నుంచి వ‌ల‌స‌వ‌చ్చిన మంజుల అనే అమ్మాయిని మోహన్ రామ్ గత యేడాది ప్రేమించి జోధ్‌పుర్‌లో పెళ్లి చేసుకున్నాను.


పెళ్లి తర్వాత మోహన్‌ రామ్‌ భార్యతో క‌డూరులో కాపురం పెట్టాడు. అత్తంటికి వచ్చిన 2 నెలల తర్వాత రాజస్థాన్ కెళ్లిన భార్య మ‌ళ్లీ తిరిగి రాలేదు. మొబైల్ లో మెసేజ్ చేసినా ఆమె నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాక‌పోవ‌డంతో భార్య‌తో మాట్లాడ‌టానికి వెళ్లిన‌ మోహన్‌కి షాక్ త‌గ‌లిగింది. త‌న భార్య మంజుల అప్ప‌టికే హ‌రియాణాకు చెందిన‌ ఓం ప్ర‌కాశ్ అనే వ్య‌క్తిని పెళ్లి చేసుకుంది. కాపురం కూడా పెట్టేసింది. తాను విడాకులు ఇవ్వ‌కుండానే రెండో పెళ్లి చేసుకున్న చెల్ల‌ద‌ని మోహ‌న్ ఆమెతో వాదించాడు. ఆమె ప‌ట్టించుకోలేదు.

మోహన్ తన భార్యకు మెసేజ్ చేస్తున్న విషయం తెలిసిన రెండో భ‌ర్త ఓం ప్రకాష్ , మోహన్ ను హ‌త్య చేయ‌డానికి ప్లాన్ వేశాడు. ఏడుగురు ముఠాతో 28న ఆదివారం రాత్రి కడూరికి వచ్చిన ఓం ప్రకాష్, మోహన్ రామ్‌ని సినిమా శైలిలో అపహరించాడు.

కారులో అపహరించుకుని వెళ్లిపోతున్న దృశ్యాన్ని స్థానికులు చూశారు. వెంట‌నే పోలీసులకు చెప్పారు. ఆ కార్ ను ఛేజ్ చేసిన కడూరు పోలీసులు వాళ్ల‌ను ప‌ట్టుకున్నారు. మోహ‌న్ ను ర‌క్షించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి