iDreamPost

70వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

70వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గడచిన కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు మూడువేల పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అవుతుండడంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య బాగా పెరిగింది. నిన్న ఒక్కరోజులో 3244 పాజిటివ్ కేసులు నిర్దారణ కావడంతో  దేశంలో కరోనా పాజిటివ్ కేసుల 70,756 చేరింది. కాగా కరోనా కారణంగా 2293 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ బారినుండి 22,454 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 46,008 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. అత్యధిక పాజిటివ్ కేసులతో పాటుగా అత్యధిక మరణాలు కూడా మహారాష్ట్రలో నమోదవుతున్నాయి.నిన్న ఒక్కరోజులోనే 1230 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో 23,401కి పాజిటివ్‌ కేసులు నిర్దారణ అయ్యాయి. కరోనా కారణంగా 868 మంది మృత్యువాతపడ్డారని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఒక్క ముంబయి నగరంలోనే కరోనా బాధితుల సంఖ్య 14,521 దాటగా పుణెలో 2,789 కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో నిన్న కొత్తగా 79 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి 1275 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 444 మంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుండగా751 మంది కరోనా బారినుండి కోలుకున్నారు. 30 మంది మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన కొన్ని రోజులతో పోలిస్తే నిన్న 38 కేసులు మాత్రమే నమోదు కావడం కాస్త ఊరతనిచ్చే అంశం. దీంతో ఆంధ్రప్రదేశ్ లో 2018 మందికి కరోనా సోకగా 45 మంది మృత్యువాత పడ్డారు.998 మంది వ్యాధి నుండి కోలుకుని రికవర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 975 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 4,256,022 మందికి కోవిడ్ 19 సోకగా 287,332 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 1,527,517 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 1,385,834 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 81,795 మంది మరణించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి