iDreamPost

ఏపీలో తాజాగా 52 మందికి కరోనా నిర్దారణ

ఏపీలో తాజాగా 52 మందికి కరోనా నిర్దారణ

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 52 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2282 కు చేరిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. కాగా  1527 మంది వైరస్ బారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా ఆక్టీవ్ కేసుల సంఖ్య 705 గా నమోదయింది. కరోనా కారణంగా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 మంది మరణించారు.

గడిచిన 24 గంటల్లో 9,713 శాంపిల్స్‌ పరీక్షించగా రాష్ట్రంలో 52 పాజిటివ్‌ కేసులు నిర్దారణ అయ్యాయి. అత్యధికంగా  చిత్తూరు జిల్లాలో 15, కృష్ణా జిల్లాలో 15 కేసులు కరోనా నిర్దారణ కాగా, నెల్లూరు 7,కర్నూల్ 4, కడప 2,వెస్ట్ గోదావరి 2, విశాఖపట్నం 1,విజయనగరంలో ఒకరికి కరోనా వైరస్ నిర్దారణ అయింది. దీంతో మొత్తం 52 పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి