iDreamPost

విద్యార్థినిపై కాలేజ్ చైర్మన్‌ లైంగిక దాడి.. అసలేం జరిగిందంటే?

ఈ మద్య దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఒంటరిగా కనిపిస్తే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు.

ఈ మద్య దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఒంటరిగా కనిపిస్తే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు.

విద్యార్థినిపై కాలేజ్ చైర్మన్‌ లైంగిక దాడి.. అసలేం జరిగిందంటే?

ఇటీవల మహిళలపై నిత్యం ఎక్కడో అక్కడ లైంగిక దాడులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది దుండగులు అత్యాచారాలు చేసి తమ గుట్టు బయటపడుతుందన్న భయంతో హత్యలకు తెగబడుతున్నారు. ఒంటరిగా మహిళలు బయటకు వెళ్లాలంటేనే భయంతో వణికిపోతున్నారు. విద్యార్థులుకు విద్యాబుద్దలు నేర్పించాల్సిన ఓ కాలేజ్ చైర్మన్ బరితెగించాడు.. విద్యార్థినిపై లైంగిక దాడికి తెగబడడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా హసన్ పర్తి లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

వరంగల్ జిల్లా భీమారంలోని శ్రీచైతన్య జూనియర్ కాలేజ్ లో ములుగు జిల్లా గోవిందరావు పేట మండలానికి చెందిన విద్యార్థిని ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. కాలేజ్ స్టూడెంట్ తో హాస్టల్ లో ఉంటుంది. శుక్రవారం రాత్ిర తన గదిలో నిద్రిస్తుండగా కాలేజ్ చైర్మన్ బూర సురేందర్ గౌడ్ అటుగా వెళ్లారు. అదే సమయంలో విద్యార్థిని లేపి అసభ్యంగా మాట్లాడి లైంగిక దాడికి ప్రయత్నించినట్లు విద్యార్థని తెలిపింది. తాను భయపడి గట్టిగా అరవడంతో తనపై దాడి చేసినట్లు కన్నీరు పెట్టుకుంది. తన అరుపులు విని మిగతా విద్యార్థినులు అక్కడికి చేరుకున్నారని.. తనను బెదిరించి చైర్మన్ అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు విద్యార్థిని తెలిపింది.

 ఈ విషయాన్ని బాధిత విద్యార్థిని ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు చెప్పడంతో వారు హాస్టల్ కి చేరుకొని కూతురితో కలిసి కేయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో చైర్మన్ పై ఎస్సీ, ఎస్టీ, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. విషయం గురించి తెలుసుకొని పలువురు విద్యార్థి సంఘాలు కాలేజ్ ఎదుట కొద్దిసేపు ధర్నా చేశారు. పరిస్థితి చేదాటుతుందని తెలిసి పోలీస్ అధికారులు అక్కడికి చేరుకొని కంట్రోల్ చేశారు. విద్యార్థినులు భద్రంగా ఉంటారన ఇంటి నుంచి హాస్టల్ కి పంపితే.. ఇలా లైంగిక దాడికి తెగబడిన చైర్మన్ ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం నింధితుడు పరారీలో ఉన్నాడని.. త్వరలోనే పట్టుకొని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి