iDreamPost

జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం.. అమర్‌నాథ్‌కు రెండు జిల్లాలు..

జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం.. అమర్‌నాథ్‌కు రెండు జిల్లాలు..

ఏపీలో జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను సీఎం వైఎస్ జగన్ నియమించారు. రాష్ట్రంలోని 26 జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏజెన్సీ జిల్లాలు రెండిటికి ఒక మంత్రిని నియమించిన సీఎం జగన్.. మిగతా 24 జిల్లాలకు 24 మంది మంత్రులను ఇన్ఛార్జ్ లుగా నియమించారు.

జిల్లా – ఇన్ఛార్జ్ మంత్రులు

గుంటూరు – మంత్రిగా ధర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం – బొత్స సత్యనారాయణ

అనకాపల్లి – పి.రాజన్నదొర

కాకినాడ – సీదిరి అప్పలరాజు

పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు – గుడివాడ అమర్నాథ్

పశ్చిమగోదావరి – దాడిశెట్టి రాజా

ఏలూరు జిల్లా – పి.విశ్వరూప్‌

తూర్పుగోదావరి – చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

ఎన్టీఆర్‌ జిల్లా – తానేటి వనిత

పల్నాడు – కారుమూరి నాగేశ్వరరావు

బాపట్ల – కొట్టు సత్యనారాయణ

కృష్ణా – మంత్రిగా రోజా

నెల్లూరు – అంబటి రాంబాబు

కడప – ఆదిమూలపు సురేశ్

విజయనగరం – ముత్యాలనాయుడు

అమలాపురం – జోగి రమేశ్

అన్నమయ్య జిల్లా – కాకాణి గోవర్ధన్ రెడ్డి

అనంతపురం – పెద్దిరెడ్డి

తిరుపతి – నారాయణస్వామి

నంద్యాల – అంజాద్ భాషా

కర్నూలు – బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

సత్యసాయి జిల్లా – గుమ్మనూరు జయరాం

చిత్తూరు – ఉషా శ్రీ చరణ్

విశాఖ – విడదల రజనీ

ప్రకాశం – మేరుగ నాగార్జున

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి