Idream media
Idream media
ప్రముఖ కవి, జానపద కళాకారుడు, ప్రజా గాయకుడు గోరేటి వెంకన్నను తెలంగాణ సీఎం కేసీఆర్ శాసన మండలి సభ్యునిగా ఎంపిక చేశారు. గవర్నర్ కోటాలో గోరేటి వెంకన్నను శాసన మండలికి పంపించాలని నిర్ణయించారు. ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో గోరేటి వెంకన్న తన గళాన్ని వినిపించారు. తెలంగాణ యాస, భాషలతో పాటలు పాడుతూ ఉద్యమాన్ని ఉర్రూతలూగించారు. ఈ నేపథ్యంలోనే గోరేటి వెంకన్నను శాసన మండలికి పంపాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
దివంగత నాయిని నర్సింహారెడ్డి, రాములు నాయక్, కర్నె ప్రభాకర్ పదవీ కాలపరిమితి ముగియడంతో ఈ ఏడాది ఆగస్టు నాటికే శాసనమండలిలో గవర్నర్ కోటా స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన రెండు స్థానాల భర్తీ పైనా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.