iDreamPost

లండన్‌ పర్యటన ముగించుకుని APకి తిరిగి వచ్చిన సీఎం జగన్‌ దంపతులు

  • Published Sep 12, 2023 | 9:25 AMUpdated Sep 12, 2023 | 9:25 AM
  • Published Sep 12, 2023 | 9:25 AMUpdated Sep 12, 2023 | 9:25 AM
లండన్‌ పర్యటన ముగించుకుని APకి తిరిగి వచ్చిన సీఎం జగన్‌ దంపతులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి లండన్‌ పర్యటనను ముగించుకుని ఏపీకి తిరిగి చేరుకున్నారు. సెప్టెంబర్ 2న తన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించిన తర్వాత.. సీఎం జగన్‌ లండన్‌ పయనమయ్యారు. అక్కడ ఉన్న తన పిల్లలకు కలిసేందుకు లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనను ముగించుకుని మంగళవారం ఉదయం 6 గంటలకు సీఎం జగన్ దంపతులు ప్రత్యేక విమానంలో గన్నవరం విమనాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. లండన్‌ పర్యటనను ముగించుకుని రాష్ట్రానికి తిరిగొస్తున్న సీఎం జగన్‌కు.. వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

మంగాళవారం ఉదయం విజయవాడ చేరుకున్న సీఎం జగన్ గన్నవరం నుంచి రోడ్డు మార్గం ద్వారా తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఇదిలా ఉండగా.. విదేశీ పర్యటన ముగించుకుని ఏపీ చేరుకున్న సీఎం జగన్.. రేపు అనగా బుధవారం నాడు.. ఢిల్లీ పర్యటకు వెళ్లనున్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కీలక బిల్లులు ప్రవేశపెడతారని ప్రచారం, చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. సీఎం ఢిల్లీ పర్యటన ప్రధాన్యత సంతరించుకుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి