iDreamPost

పిల్లల్ని కిడ్నాప్ చేస్తోందని.. కరాటే కళ్యాణి ఇంటిపై చైల్డ్ వెల్ఫేర్ అధికారుల దాడి..

పిల్లల్ని కిడ్నాప్ చేస్తోందని.. కరాటే కళ్యాణి ఇంటిపై చైల్డ్ వెల్ఫేర్ అధికారుల దాడి..

గత మూడు రోజులుగా నటి కరాటే కళ్యాణి వార్తల్లో నిలుస్తుంది. ప్రాంక్ యూట్యూబర్ శ్రీకాంత్ పై అర్ధరాత్రి దాడి చేయడం, తర్వాత ఒకరిపై ఒకరు పోలీసులకి ఫిర్యాదు చేయడం, మరో వ్యక్తి కరాటే కళ్యాణి మోసం చేసిందని ఫిర్యాదు చేయడం.. ఇలా కరాటే కళ్యాణి హాట్ టాపిక్ గా మారింది ప్రస్తుతం.

తాజాగా కరాటే కళ్యాణి గురించి మరో బ్రేకింగ్ న్యూస్ అందింది. తాజాగా SR నగర్ స్టేషన్ పరిధిలో వెంగళ్ రావ్ నగర్ లో కరాటే కళ్యాణి ఇంటిపై చైల్డ్ వెల్ఫేర్ అధికారులు దాడులు నిర్వహించారు. పలువురు చిన్నారులను కళ్యాణి కిడ్నాప్ చేయడంతో పాటు 2 నెలల పిల్లలను కొనుగోలు చేసినట్టు అధికారులకు ఫిర్యాదు అందింది. అంతేకాక నెలల పిల్లలను అడ్డుపెట్టుకొని డబ్బులు వసూలు చేస్తున్నట్టు పిర్యాదు రావడంతో విచారణ కోసం కల్యాణి నివాసం వద్దకు చైల్డ్ వెల్ఫేర్ అధికారులు వెళ్లారు. ప్రస్తుతం కరాటే కళ్యాణిని ఆమె నివాసం వద్దే అధికారులు విచారిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి