iDreamPost

అత్తపై మోజుపడ్డ అల్లుడు.. కోరిక తీర్చలేదని చంపేశాడు!

అత్తపై మోజుపడ్డ అల్లుడు.. కోరిక తీర్చలేదని చంపేశాడు!

ఈ రోజుల్లో కొందరు కామాంధులు కోరిక తీర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. ఇంకొందరైతై అక్కా, చెల్లి, వదిన, అత్త, కూతురు ఇలా వావి వరసులు మరిచి బరితెగించి ప్రవర్తిస్తూ చివరికి హత్యలకు కూడా వెనకాడడం లేదు. అచ్చం ఇలాంటి ఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది. ఓ యువకుడు తన స్నేహితుడితో కలిసి కోరిక తీర్చలేదని తన మేనత్తను అతి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

పోలీసుల కథనం ప్రకారం.. చెన్నైలోని కొడుంగయ్యూర్‌ ప్రాంతంలో 48 ఏళ్ల ఓ మహిళ నివాసం ఉండేది. ఈమెకు అగస్టిన్ అరుణ్ అనే మేనల్లుడు ఉండేవాడు. ఇతడు మద్యానికి అలవాటుపడి జులాయిగా తిరుగుతుండేవాడు. ఈ క్రమంలోనే అరుణ్ తన మేనత్తపై మోజుపడ్డాడు. ఎప్పటి నుంచో అత్తతో కోరిక తీర్చుకోవాలని ఆరాటపడుతున్నాడు. సమయం కోసం ఎదురు చూశాడు. ఇక ఆ రోజు కూడా రానే వచ్చింది. మొత్తానికి అరుణ్ తన కోరికను ఇటీవల అత్తకు వివరించాడు. అల్లుడు మాటలు విన్న అత్త ఒక్కసారిగా షాక్ గురైంది. ఏదైనా సరే నా కోరిక తీర్చాలని అరుణ్ అత్తను బలవంతం చేశాడు. దీనికి అత్త నిరాకరించి అతడికి గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చింది.

దీంతో అరుణ్ అత్తపై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను హత్య చేయాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే ఆ యువకుడు తన స్నేహితుడైన సోలమన్ (22) సహకారం తీసుకుని శనివారం అత్తింటికి వెళ్లాడు. ఇక పథకం ప్రకారమే.. ఆ ఇద్దరు యువకులు కలిసి ఆ మహిళను దారుణంగా కొట్టి చంపి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితులను అరెస్ట్ చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. కోరిక తీర్చలేదని అత్తను చంపిన యువకుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: కుమార్తె దారుణం.. గాజు పెంకుతో తండ్రి గొంతు కోసి..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి