iDreamPost

దేశంలో రెండువేలు దాటిన కరోనా మరణాలు

దేశంలో రెండువేలు దాటిన కరోనా మరణాలు

ఒక్కరోజులో 3277 పాజిటివ్ కేసులు – 128 మరణాలు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గడచిన కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు మూడువేల పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అవుతుండడంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య బాగా పెరిగింది. నిన్న ఒక్కరోజులో 3277 పాజిటివ్ కేసులు నిర్దారణ కావడంతో  దేశంలో కరోనా పాజిటివ్ కేసుల 62,939కి చేరింది. కాగా కరోనా కారణంగా 2109 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ బారినుండి 19,358 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 41,472 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. అత్యధిక పాజిటివ్ కేసులతో పాటుగా అత్యధిక మరణాలు కూడా మహారాష్ట్రలో నమోదవుతున్నాయి.  దీంతో రాష్ట్రంలో 20,228 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 779మంది మృత్యువాతపడ్డారని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఒక్క ముంబయి నగరంలోనే కరోనా బాధితుల సంఖ్య 12వేలు దాటగా పుణెలో 2,700కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో 1163 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న కొత్తగా 31  కేసులు నిర్దారణ అయ్యాయి. 30 మంది మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతిన్నాయి. గడచిన 24 గంటల్లో 50 కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. 1980 మందికి కరోనా సోకగా 45 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1010 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 4,101,975 మందికి కోవిడ్ 19 సోకగా 280,451 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 1,441,873 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 1,347,310 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 80,037 మంది మరణించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి