iDreamPost

ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ బడ్జెట్

ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ బడ్జెట్

కరోనా మహమ్మారి కారణంగా కాస్త ఆలస్యమైనా ఎట్టకేలకు బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి వరుసగా రెండవ ఏడు కూడా బడ్జెట్ ప్రవేశ పెట్టారు. అన్ని రకాల సంపదల్లో పేదలకు భాగం కల్పించినవాడే నిజమైన నాయకుడు అనే మాటలను స్పూర్తిగా తీసుకుని అన్ని వర్గాల అభివృద్ధి కోసం తాము మానిఫెస్టో తయారు చేసి ఎన్నికల్లో గెలిచిన తరువాత ఆ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఏడాదిలోనే 90% హామీలు నెరవేర్చామని చెప్పుకొచ్చారు .

రాష్ట్రం ఆర్ధికంగా ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఏడాదిపాటు పాలనను అన్ని విదాలుగా సమర్ధవంతంగా పాలించబట్టే నేడు 2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో (2020–21) సంవత్సరానికి గాను ప్రభుత్వం రూపొందించిన సంక్షేమ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టగలిగామని. గ్రామ , వార్డు వాలంటీర్ల వ్యవస్థ, అలాగే గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం వేసిన గొప్ప ముందడుగు, సుమారు 4 లక్షల ఉద్యోగాలు గెలిచిన ఏడాదిలోనే ఇవ్వడం ఈ ప్రభుత్వం వేసిన గొప్ప ముందడుగుగా ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి చెప్పుకోచ్చారు.

ఇక వివిధ రంగాల వారీగా బడ్జెట్‌ కేటాయింపుల విషయానికి వస్తే

వ్యవసాయ రంగానికి రూ. 11,891 కోట్లు,
ఆరోగ్య రంగానికి రూ.11,419.44 కోట్లు,
పశుగణాభివృద్ధి, మత్స్యరంగానికి రూ.1279.78 కోట్లు,
గృహ నిర్మాణ రంగానికి రూ.3,691.79 కోట్లు,
హోంశాఖకు రూ.5,988.72 కోట్లు,
జలవనరుల శాఖకు రూ. 11,805.74 కోట్లు,
పెట్టుబడులు, మౌలిక వసతుల రంగానికి రూ.696.62 కోట్లు,
ఐటీ రంగానికి రూ. 197.37 కోట్లు,
కార్మిక సంక్షేమానికి రూ. 601.37 కోట్లు,
పంచాయతీరాజ్, రూరల్‌ డెవలప్‌మెంట్‌కు రూ. 16710.34 కోట్లు,
న్యాయశాఖకు రూ. 913.76 కోట్లు,
మున్సిపల్‌ పట్టణాభివృద్ధి శాఖలకు రూ. 8150.24 కోట్లు,
స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు రూ. 856.64 కోట్లు,
పౌరసరఫరాల శాఖకు రూ. 3,520.85 కోట్లు,
ఆర్థిక రంగానికి రూ. 50,703 కోట్లు,
విద్యుత్‌ రంగానికి రూ. 6,984.72 కోట్లు,
ప్రాథమిక ఉన్నత విద్యకు రూ. 22,604.01 కోట్లు,
సోషల్‌ వెల్ఫేర్‌ కోసం రూ.12,465.85 కోట్లు,
ట్రాన్స్‌పోర్టు, ఆర్‌అండ్‌బీ కోసం రూ.6,588.58 కోట్లు,
మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం రూ.3456.02 కోట్లు,
మైనార్టీ సంక్షేమానికి రూ.2,055.63 కోట్లు,
ప్రణాళికా రంగానికి రూ.515.87 కోట్లు,
పర్యావరణం, అటవీశాఖకు రూ.457.32 కోట్లు,
సాధారణ పరిపాలనకు రూ.878.01 కోట్లు,
ఎస్సీల సంక్షేమానికి రూ.15,735 కోట్లు,
గిరిజనుల సంక్షేమానికి రూ.5,177.54 కోట్లు,
కాపుల సంక్షేమానికి రూ.2,846.47 కోట్లు,
ఎస్సీ, ఎస్టీ గృహాల ఉచిత విద్యుత్‌కు రూ.425.93 కోట్లు,
104, 108 వాహన సేవలకు రూ.470.29 కోట్లు,
గ్రామీణాభివృద్ధికి రూ.16,710 కోట్లు,
సాగునీటి పారుదల శాఖకు రూ.11,805 కోట్లు,
రవాణా రంగానికి రూ.6,588 కోట్లు,
డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కోసం రూ. 2100 కోట్లు,
నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కోసం రూ. 1808.03 కోట్లు

వివిధ పథకాలు, మౌలిక వసుతుల కోసం బడ్జెట్‌ కేటాయింపులు

వైఎస్సార్‌ లా నేస్తం కోసం రూ. 12.75 కోట్లు,
రైతులకు విత్తనాల పంపిణీ కోసం రూ.200 కోట్లు,
జగనన్న విద్యాకానుక కోసం రూ.500 కోట్లు,
ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియం కోసం రూ. 55.15 కోట్లు,
కొత్త రాజధానిలో మౌలిక వసతుల కోసం రూ. 500 కోట్లు,
ప్రతిభ స్కాలర్‌షిప్స్‌ కోసం రూ. 10.54 కోట్లు,
నేషనల్‌ హార్టీకల్చర్‌ మిషన్‌ రూ. 150.99 కోట్లు,
పట్టణ స్వయం సహాయక బృందాల కోసం రూ. 389.89 కోట్లు,
రైతులకిచ్చే నష్ట పరిహారం కోసం రూ. 20 కోట్లు,
గ్రామ సచివాలయాల కోసం రూ. 1633 కోట్లు,
అమరావతి-అనంతపురం నేషనల్‌ హైవే కోసం రూ. 100 కోట్లు,
వైఎస్సార్‌ గృహ వసతి కోసం రూ. 3 వేల కోట్లు,
డ్రగ్స్‌, మందుల కేంద్రీకృత కొనుగోళ్ల కోసం రూ. 400 కోట్లు,
కుటుంబ సంక్షేమ కేంద్రాల కోసం రూ. 242.15 కోట్లు,
వ్యవసాయ మార్కెట్ల మౌలిక సదుపాయాల నిధి రూ. 100 కోట్లు,
అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.200 కోట్లు,
వైఎస్సార్‌‌ సంపూర్ణ పౌషణ పథకానికి రూ.1500 కోట్లు,
డ్వాక్రా మహిళల సున్నా వడ్డీ పథకానికి రూ.1365.08 కోట్లు,
వైఎస్సార్‌ పెన్షన్‌ కానుకకు రూ.16వేల కోట్లు,
జగనన్న అమ్మఒడి పథకానికి రూ.6వేల కోట్లు,
వైఎస్సార్‌ చేయూత పథకానికి రూ.3వేల కోట్లు,
వైఎస్సార్‌ ఆసరా పథకానికి రూ.6,300 కోట్లు,
వైఎస్సార్ వాహనమిత్ర పథకానికి రూ.275.52 కోట్లు,
వైఎస్సార్ నేతన్ననేస్తం పథకానికి రూ.200 కోట్లు,
జగనన్న తోడు పథకానికి రూ.930 కోట్లు,
జగనన్న చేదోడు పథకానికి రూ.247 కోట్లు,
గ్రామ,వార్డు సచివాలయ వాలంటీర్ల వ్యవస్థకు రూ.46.46 కోట్లు,
రియల్‌ టైం గవర్నెన్స్‌ కోసం రూ.54.51 కోట్లు,
వ్యవసాయ ల్యాబ్‌లకు రూ.65 కోట్లు,
వైఎస్‌ఆర్‌ రైతుభరోసా – పీఎం కిసాన్‌కు రూ.3,615.60 కోట్లు,
డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ పంటల ఉచిత బీమా పథకానికి రూ.500 కోట్లు,
జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనలో ఉన్నత విద్యకు రూ.2,277 కోట్లు,
డాక్టర్‌ వైఎస్సార్‌‌ పంటల ఉచిత బీమా పథకానికి రూ.500 కోట్లు,
వడ్డీలేని రుణాల కోసం రూ.1100 కోట్లు కేటాయించారు,

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి