iDreamPost

రాజకీయాలకు అతీతంగా.. సన్నిహితుడి పాడె మోసిన బండి సంజయ్- కౌశిక్ రెడ్డి!

రాజకీయాలకు అతీతంగా.. సన్నిహితుడి పాడె మోసిన బండి సంజయ్- కౌశిక్ రెడ్డి!

హుజూరాబాద్ లో రాజకీయాలకు అతీంతంగా హృదయాలను హత్తుకునే ఒక సంఘటన జరిగింది. బీఆర్ఎస్ సీనియర్ నేత నందగిరి మహేందర్ రెడ్డి(39) జులై 6న కాలం చేసిన విషయం తెలిసిందే. డాడీ లే డాడీ అంటూ అయన కుమారుడు కన్నీళ్లు పెట్టుకోవడం చూసి అందరి హృదయాలు ద్రవించిపోయాయి. మహేందర్ రెడ్డి అంత్యక్రియలు హుజారాబాద్ లో శుక్రవారం నిర్వహించారు.

అంత్యక్రియల్లో బీజేపీ ఎంపీ బండి సంజయ్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ కౌసిక్ రెడ్డి పాల్గొన్నారు. అందరూ కలిసి మహేందర్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇలాంటి సమయంలో మనో నిబ్బరాన్ని కోల్పోకూడదు అంటూ ధైర్యం చెప్పారు. ఆ తర్వాత కౌశిక్ రెడ్డి, బండి సంజయ్ కలిసి మహేందర్ రెడ్డి పాడె మోశారు. మహేందర్ రెడ్డి గతంలో హుజూరాబాద్ బీజేపీ అధ్యక్షుడిగా కూడా పని చేశాడు.

ఆ సమయంలో బండి సంజయ్ కి ఎంతో సాన్నిహత్యంగా ఉండేవాడు. తర్వాత బీఆర్ఎస్ లో పార్టీలో చేరారు. కౌశిక్ రెడ్డి నియోజకవర్గం కూడా ఇదే కావడంతో వారి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది. గతంలో కౌశిక్ రెడ్డి పని చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో వేర్వేరు పార్టీ అయినా కూడా వారి మధ్య మంచి సత్సంబంధాలు ఉండేవి. సమ వయస్కులు కావడంతో వారి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. కేవలం 39 సంవత్సరాల చిన్న వయసులో గుండెపోటుతో మరణించడం అందరినీ కలచి వేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి