iDreamPost

వీడియో: ‘బేబీ’ సక్సెస్ టూర్​లో గొడవ.. నిర్మాత ఎస్​కేఎన్ ఎంట్రీతో..!

  • Author singhj Updated - 11:41 AM, Fri - 4 August 23
  • Author singhj Updated - 11:41 AM, Fri - 4 August 23
వీడియో: ‘బేబీ’ సక్సెస్ టూర్​లో గొడవ.. నిర్మాత ఎస్​కేఎన్ ఎంట్రీతో..!

ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపుగా పెద్ద సినిమాలదే హవా అని చెప్పొచ్చు. ప్రతి ఏడాది సూపర్ హిట్స్​గా నిలిచే మూవీస్​లో సుమారుగా అన్నీ బిగ్ మూవీస్ ఉంటాయి. ఆ లిస్టులో ఒకట్రెండు చిన్న చిత్రాలే ఉంటాయి. కానీ అవి సృష్టించే మేనియా అంతా ఇంతా కాదు. ఈ ఏడాది అలా సంచలనం సృష్టించిన సినిమానే ‘బేబీ’. చిన్న చిత్రంగా రిలీజై డబుల్ బ్లాక్​ బస్టర్​గా నిలిచిందీ మూవీ. బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న ‘బేబీ’ ఏకంగా రూ.80 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సెన్సేషనల్​ రన్​ను కొనసాగిస్తోంది. ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లను చూస్తుంటే రూ.100 కోట్ల క్లబ్​లోకి చేరినా ఆశ్చర్యపోనవసరం లేదనిపిస్తోంది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘బ్రో’ సినిమా విడుదల తర్వాత కూడా ‘బేబీ’ దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. మూడో వీకెండ్​లోనూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని చాలా చోట్ల ఈ చిత్రం ప్రదర్శితం అవుతున్న థియేటర్లు హౌస్ ఫుల్స్ అయ్యాయి. ‘బ్రో’ మూవీకి నాలుగో రోజు నుంచి కలెక్షన్లు దారుణంగా పడిపోవడం కూడా ‘బేబీ’కి కలిసొస్తోంది. మరో వారం వరకు పెద్ద సినిమాలు రిలీజ్ కావడం లేదు. ఈ గ్యాప్ ఆ చిత్రానికి మరింత కలసి రావొచ్చు. యూత్​ ఆడియెన్స్​కు ఎక్కువగా కనెక్ట్ అయిన ఈ మూవీని సాయి రాజేష్ డైరెక్ట్ చేశారు. ఇందులో ఆనంద్ దేవరకొండతో పాటు వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్​ల నటన అందర్నీ ఆకట్టుకుంటోంది.

‘బేబీ’ చిత్రం రిలీజై 20 రోజులైనా బాక్సాఫీస్ వద్ద జోరు ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో ఈ మూవీ టీమ్ ఇటీవల సక్సెస్​ మీట్​ నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్​లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్న విషయం తెలిసిందే. సక్సెస్ మీట్ తర్వాత ప్రేక్షకుల్ని నేరుగా కలవాలని ‘బేబీ’ టీమ్ నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో సక్సెస్​ టూర్ ప్లాన్ చేసింది. ఈ క్రమంలో భీమవరంలో నిర్వహించిన సక్సెస్ టూర్​లో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. లోకల్ మీడియా కాంట్రిబ్యూటర్లకు, బౌన్సర్లకు మధ్య గొడవ జరిగింది. అయితే మధ్యలోకి చిత్ర నిర్మాత ఎస్​కేఎన్ ఎంట్రీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్​గా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి