iDreamPost

ఘోరం: బాలికను చంపి మృతదేహంపై అత్యాచారం, ఎక్కడో కాదు..!

ఘోరం: బాలికను చంపి మృతదేహంపై అత్యాచారం, ఎక్కడో కాదు..!

మన దేశంలో ఆడ పిల్లలపై దారుణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్పా తగ్గడం లేదు. ఇటు 6 ఏళ్ల బాలికల నుంచి అటు 60 ఏళ్ల వృద్దుల వరకు కామంధులు ఎవరినీ వదలకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అయితే ఈ వరుస ఘటనలు మరువక ముందే ఇటీవల మరో ఘోరమైన చర్య వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్ బాలికను ముగ్గురు దుర్మార్గులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఇంతటితో ఆగకుండా ఆ బాలిక మృతదేహంపై అత్యాచారం కూడా చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని తాజాగా నిందితులను అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. అస్సాం కరీంగంజ్ జిల్లాలోని ఓ ప్రాంతంలో ఈ నెల 9న ఓ మైనర్ బాలిక ఇంటి వద్ద ఒంటరిగా ఆడుతూ ఉంది. అయితే ఈ క్రమంలో ఆ బాలికను గమనించిన ముగ్గురు దుర్మార్గులు.. ఎవరూ లేని సమయంలో ఆ చిన్నారి ఇంట్లోకి చొరబడ్డారు. ఆ తర్వాత బలవంతంగా ఆ బాలికపై అత్యాచారం చేయబోయారు. దీంతో ఆ అమ్మాయి కేకలు వేయడంతో ఏం చేయాలో తెలియక ఆ కేటుగాళ్లు గొంతు పిసికి హత్య చేశారు. ఇక ఇంతటితో సరిపెట్టని ఆ దుర్మార్గులు.. ఆ చిన్నారి మృతదేహాన్ని సైతం వదలకుండా ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడి అక్కడి నుంచి పరారయ్యారు.

ఈ విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇదే విషయం చివరికి పోలీసుల దృష్టికి వెళ్లడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంతా పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెల్ ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితులను గురువారం అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. మైనర్ బాలికను హత్య చేసి మృతదేహంపై అత్యాచారం చేసిన ఈ ఘోరమైన చర్యపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి