Dharani
Dharani
రచిత మహాలక్ష్మి.. అంటే తెలియకపోవచ్చు కానీ.. ఈటీవీలో వచ్చిన స్వాతి చినుకులు సీరియల్ హీరోయిన్ అంటే వెంటనే గుర్తు పడతారు. తాజాగా రచిత పోలీసులను ఆశ్రయించింది. భర్త నుంచి వేరుగా ఉంటునప్పటికి.. అతడు తనను వేధిస్తున్నాడని.. అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. రచిత భర్త.. దినేశ్ కార్తీక్. వీరిద్దరూ కలిసి తొలిసారి పిరివం సంతిప్పమ్ సీరియల్లో కలిసి నటించారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి.. వీరిద్దరూ పదేళ్ల క్రితం అనగా.. 2013లో వివాహం చేసుకున్నారు. ఆన్స్క్రీన్లో హిట్ పెయిర్గా గుర్తింపు తెచ్చుకున్న.. వీరిద్దరూ ఆఫ్స్క్రీన్లో మాత్రం.. జోడిగా ఉండలేకపోయారు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దాంతో గత కొంతకాలంగా వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు. రచిత తమ బంధం గురించి ఎక్కడా మాట్లాడటం లేదు. కానీ దినేశ్ మాత్రం త్వరలోనే తామిద్దరం కలుస్తామని.. పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు.
ఇక గత కొంతకాలంగా వీరిద్దరూ వేర్వేరేగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా రచిత తన భర్త దినేశ్ కార్తీక్.. తనను బెదిరిస్తున్నాడంటూ.. అసభ్యకర సందేశాలు పంపి.. వేధిస్తున్నాడంటూ.. మంగళవారం చెన్నై మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. రచిత తన మీద కంప్లైంట్ చేసింది అను తెలుసుకున్న కార్తీక్.. వెంటనే సదరు పోలీస్ స్టేషన్కు వెళ్లి.. పోలీసులతో మాట్లాడాడు. రచిత తన మీద ఇలా ఫిర్యాదు చేసే బదులు.. కోర్టును ఆశ్రయించి.. విడాకులు తీసుకోవచ్చని సూచించాడు.
ఇదిలా ఉంటే రచిత క్లోజ్ ఫ్రెండ్, డబ్బింగ్ ఆర్టిస్ట్ జీజీ కూడా గతంలో దినేశ్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన సలహా వల్లే రచిత.. దినేశ్తో విడిపోయిందని అతడు పలు ఇంటర్వ్యూలతో చెప్తున్నాడని ఆరోపించింది జీజీ. తన వల్లే రచిత-దినేశ్లు విడిపోయారంటూ తనపై లేనిపోని అభాండాలు వేస్తున్నాడని జీజీ తన ఫిర్యాదులో పేర్కొంది. ఇకపోతే రచితా మహాలక్ష్మి పిరివమ్, సంతిప్పం ఇళవరసై, శరవణన్ మీనాక్షి(వరుసగా మూడు సీక్వెల్స్లోనూ తనే నటించింది), నాట్యపురం వంటి సీరియల్స్లో ప్రధాన పాత్రలు పోషించింది. తెలుగులో స్వాతి చినుకులు సీరియల్లో నటించింది. తమిళ బిగ్బాస్ ఆరవ సీజన్లోనూ పాల్గొంది. పారిజాత అనే కన్నడ చిత్రంలో, ఉప్పు కరువద అనే తమిళ చిత్రంలోనూ నటించింది.