iDreamPost

ఘనంగా బాలయ్య హీరోయిన్ నిశ్చితార్థం! వైరలవుతున్న ఫోటోలు..

  • Author Soma Sekhar Published - 02:58 PM, Tue - 18 July 23
  • Author Soma Sekhar Published - 02:58 PM, Tue - 18 July 23
ఘనంగా బాలయ్య హీరోయిన్ నిశ్చితార్థం! వైరలవుతున్న ఫోటోలు..

గతకొంత కాలంగా సినిమా ఇండస్ట్రీలో పెళ్లి వార్తల, ఎంగేజ్ మెంట్ వార్తల సందడి ఎక్కువైంది. హీరోయిన్స్, హీరోలు వరుసగా నిశ్చితార్థాలు, పెళ్లిళ్లు చేసుకుని వైవాహిక జీవితాల్లోకి అడుగుపెడుతున్నారు. ఇటీవలే వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ జరిగిన విషయా తెలిసిందే. వీరితో పాటుగా మరికొంతమంది టాలీవుడ్, బాలీవుడ్ నటీ, నటుల నిశ్చితార్థం పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా బాలకృష్ణ హీరోయిన్ ఎంగేజ్ మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తనకు నిశ్చితార్థం జరిగిందని స్వయంగా ఆ హీరోయిన్ ఫోటోలను షేర్ చేసింది.

బాలకృష్ణ హీరోగా నటించిన ‘జై సింహా’ సినిమాలో హీరోయిన్ గా నటించింది నటాషా దోషి. ఈమె పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించినప్పటికీ పెద్దగా పేరుతెచ్చుకోలేకపోయింది. దాంతో ఈ అమ్మడుకు పెద్దగా అవకాశాలు తలుపుతట్టలేదు. సినిమాల్లో తక్కువ కనిపించినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది నటాషా దోషి. తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా తన ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో ఈ పిక్స్ కాస్త వైరల్ గా మారాయి.

కాగా.. ఈ పోస్ట్ లో తనకు కాబోయే భర్త పేరు మనన్ షా అని, అతడితో కలిసి ఏడడుగులు వేయబోతున్నాను అని నటాషా రాసుకొచ్చింది. అదీకాక ప్రేమ ఎప్పుడూ విజయం సాధిస్తుందని రాయడంతో.. వీరిది ప్రేమ వివాహం అని స్పష్టంగా అర్థం అవుతోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే పెళ్లి డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు ఈ బ్యూటీ. దాంతో బాలయ్య హీరోయిన్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు, నెటిజన్లు.

 

View this post on Instagram

 

A post shared by Natasha Doshi (@natashadoshi)

 

View this post on Instagram

 

A post shared by Natasha Doshi (@natashadoshi)


ఇదికూడా చదవండి: పనిమనిషిగా జీవితం ప్రారంభించి.. స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగి.. చివరకు అనాథగా!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి