iDreamPost

డైరెక్టర్ ఓవర్‌ యాక్షన్ కి బుద్ది చెప్పిన తెలుగు హీరోయిన్!

చిత్రపరిశ్రమలో హీరోయిన్లకు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. వాటిని కొందరు వెంటనే ఖండించగా, మరికొందరు మాత్రం చూసిచూడనట్లు వదిలేస్తుంటారు. అంతే కొందరు హీరోయిన్లు మాత్రం తమపై కామెంట్స్ చేసిన వారికి బుద్ధి చెప్పేలా రిప్లయ్ ఇస్తుంటారు. తాజాగా ఓ హీరోయిన్ అదే పని చేశారు.

చిత్రపరిశ్రమలో హీరోయిన్లకు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. వాటిని కొందరు వెంటనే ఖండించగా, మరికొందరు మాత్రం చూసిచూడనట్లు వదిలేస్తుంటారు. అంతే కొందరు హీరోయిన్లు మాత్రం తమపై కామెంట్స్ చేసిన వారికి బుద్ధి చెప్పేలా రిప్లయ్ ఇస్తుంటారు. తాజాగా ఓ హీరోయిన్ అదే పని చేశారు.

డైరెక్టర్ ఓవర్‌ యాక్షన్ కి బుద్ది చెప్పిన తెలుగు హీరోయిన్!

సినీ ఇండస్ట్రీలో కూడా అనేక రకాల వివాదాలు ఉంటాయి. కొందరు సోషల్ మీడియా వేదికగా పరస్పరం విమర్శలు చేసుకుంటారు. కొందరు అయితే హీరోయిన్ల విషయంలో ఓవర్ గా బిహేవ్ చేస్తుంటారు. అలా ఓవర్ యాక్షన్ చేసే వారికి  హీరోయిన్లు కూడా తమదైన శైలీలో బుద్ది చెబుతుంటారు. ఇప్పటికే అలా ఎన్నో ఘటనలు జరిగాయి. తాజాగా తెలుగు హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ కూడా అలానే ఓ డైరెక్ట్ చేసిన ఓవర్ యాక్షన్ కి బుద్ది చెప్పింది. మరి.. ఆ విషయాలు ఏమిటో తెలుసుకోవాలంటే..ఈ స్టోరీ చదవాల్సిందే..

ఐశ్వర్య రాజేశ్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కౌసల్య కృష్ణ మూర్తి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఐశ్వర్య రాజేశ్ పరిచయం అయ్యారు. తొలి సినిమాలోనే తనదైన నటనతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు. ఆ తరువాత మిస్ మ్యాచ్, వర్డల్ ఫేమస్ లవర్, టక్ జగదీష్, రిపబ్లిక్ వంటి పలు చిత్రాల్లో నటించింది. ఆమె తొలుత తమిళ ఇండస్ట్రీ నుంచి పరిచయమైనప్పటికి తెలుగు మూలలు ఉన్నాయి.

ప్రస్తుతం తన యాక్టింగ్‌ ట్యాలెంట్‌తో.. కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్న అమ్మాయిపై ఓ యంగ్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అతడు చేసిన ఓవర్ యాక్షన్ వ్యాఖ్యలపై, ఐశ్వర్య రాజేశ్ ఫ్యాన్స్ మండిపడ్డారు. ఆమెకు అసలు ఏమి తెలియనట్లే ఆ డైరెక్టర్ కి బుద్ది వచ్చేలా ట్వీట్ చేసింది. ఆ దర్శకుడు.. ఏం అన్నారంటే.. తాను దర్శకత్వం చేసిన సినిమాతోనే ఐశ్వర్య రాజేశ్‌ ఇండస్ట్రీకి పరిచయం అయ్యిందని, ఆ విషయం ఆమె ఎక్కడా కూడా చెప్పలేదని తెలిపారు. ఇప్పుడు ఆమెకు స్టార్ డమ్ రావడంతో తనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించడం లేదని, ఒకప్పుడు ఆమెకు ఆటోకు కూడా డబ్బులు లేకపోతే నేనే ఇచ్చానని ఓ ఇంటర్వ్యూలో ఐశ్యర్వపై ఈ హాట్ కామెంట్ చేశారు ఆ డైరెక్టర్. ఇక ఆ యువ దర్శకుడి మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. చివరకు అవి ఐశ్వర్య రాజేశ్ వద్దకు చేరడంతో ఆమె కూడా రియాక్ట్ అయ్యారు.

ఆ దర్శకుడి పేరు కానీ, ఆయన చేసిన వ్యాఖ్యలను కానీ ఎక్కడ  ప్రస్తావించకుండా..ఈ అమ్మడు ట్వీట్ చేశారు. చాలా మంది ఒక వైపే విని మాట్లాడుతుంటారని,  ఆ దర్శకుడు వ్యాఖ్యలను మెన్షన్ చేయకుండా ఓ ట్వీట్ చేశారు. అంతేకాక అసలు నిజాలు తెలుసుకోకుండా, ఓ నిర్ణయానికి వచ్చి..అనుబంధాలను చెడగొట్టే ప్రయత్నం చేసుకుంటున్నారని, ఎవరైన సరే, అసలు విషయాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందంటూ ఐశ్వర్య తన ట్వీట్ లో రాసుకొచ్చారు. ఇక ఐశ్వర్యాకు మద్దతుగానే చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అలనే ఐశ్వర్య ట్వీట్‌ను పట్టుకున్నఆమె అభిమానునలు.. డైరెక్టర్‌ తీరును ట్రోల్ చేస్తున్నారు. ఐశ్వర్య.. తన ట్వీట్‌తో..ఆ దర్శకుడికి బుద్ది చెప్పిందని అంటున్నారు. మరి.. ఈ ఇష్యూపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి